Nirmal: సెలవు రోజు కావడంతో ఆ చిన్నార్లు సరదాగా గడుపుదామనుకున్నారు. స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్లడమే వారి కుటుంబాలకు ఆరని వేదన మిగిల్చింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.
సరదాగా వెళ్లి.. ప్రమాదంలో చిక్కుకొని..
కుబీర్ గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు సెలవు దినం కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు సమీపంలోని డోడర్నా చెరువు వద్దకు వెళ్లారు. వీరిలో ఒక బాలుడు ఒడ్డునే ఉండిపోగా, గణేష్ (13), సోఫియాన్ (10) అనే ఇద్దరు బాలురు చెరువులోకి దిగారు. నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ప్రమాదవశాత్తు ఇద్దరూ మునిగిపోయారు.
చికిత్స పొందుతూ ఒకరు.. చెరువులోనే మరొకరు..
ఒడ్డున ఉన్న బాలుడి కేకలు విని స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. నీటిలో మునిగిన గణేశ్ను బయటకు తీసి, అత్యవసర చికిత్స కోసం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానీ, అక్కడ చికిత్స పొందుతూ గణేష్ తుదిశ్వాస విడిచాడు. మరోవైపు సోఫియాన్ చెరువులోనే ప్రాణాలు కోల్పోయాడు.
Also Read: నా ప్రాణాలు కాపాడిన నాయకుడు ఇకలేరు..పెద్ది సంతాప సభలో హరీష్ రావు కన్నీళ్లు