E-Paper
Advertisement

నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి!

నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి!
Advertisement

Nirmal: సెలవు రోజు కావడంతో ఆ చిన్నార్లు సరదాగా గడుపుదామనుకున్నారు. స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్లడమే వారి కుటుంబాలకు ఆరని వేదన మిగిల్చింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.

సరదాగా వెళ్లి.. ప్రమాదంలో చిక్కుకొని..

Advertisement

కుబీర్ గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు సెలవు దినం కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు సమీపంలోని డోడర్నా చెరువు వద్దకు వెళ్లారు. వీరిలో ఒక బాలుడు ఒడ్డునే ఉండిపోగా, గణేష్ (13), సోఫియాన్ (10) అనే ఇద్దరు బాలురు చెరువులోకి దిగారు. నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ప్రమాదవశాత్తు ఇద్దరూ మునిగిపోయారు.

చికిత్స పొందుతూ ఒకరు.. చెరువులోనే మరొకరు..

Advertisement

ఒడ్డున ఉన్న బాలుడి కేకలు విని స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. నీటిలో మునిగిన గణేశ్‌ను బయటకు తీసి, అత్యవసర చికిత్స కోసం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానీ, అక్కడ చికిత్స పొందుతూ గణేష్ తుదిశ్వాస విడిచాడు. మరోవైపు సోఫియాన్ చెరువులోనే ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: నా ప్రాణాలు కాపాడిన నాయకుడు ఇకలేరు..పెద్ది సంతాప సభలో హరీష్ రావు కన్నీళ్లు

Tags

Related News

11 ఏళ్లుగా చక్రాల కుర్చీలోనే చిన్నారి.. సాయం కోసం ఎదురుచూస్తున్న కన్నపేగు!

ఘన్‌పూర్ లెదర్ పార్క్.. హామీలకే పరిమితమా?

నాగార్జున సాగర్ గడ్డపై వరుణయాగం.. పూర్ణాహుతిలో పాల్గొన్న రేవంత్, ఉత్తమ్ దంపతులు!

నా ప్రాణాలు కాపాడిన నాయకుడు ఇకలేరు..పెద్ది సంతాప సభలో హరీష్ రావు కన్నీళ్లు

మంత్రి పొంగులేటి స్పీచ్.. అడ్డుకున్న పాడి కౌశిక్ రెడ్డి

రెండేళ్లలో కేసీఆరే సీఎం.. నర్సంపేట కాలేజీకి పెద్ది పేరే: కేటీఆర్

మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి.. గొంతుపై తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×