E-Paper
Advertisement

Operation Smile: జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఆపరేషన్ స్మైల్‌ విజయవంతం.. బాలబాలికలు సేఫ్!

Operation Smile: జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఆపరేషన్ స్మైల్‌ విజయవంతం.. బాలబాలికలు సేఫ్!

Operation Smile: స్వేచ్ఛ బ్యూరో: జోగుళాంబ గద్వాల్ జిల్లాలో బాల కార్మికత్వం నిర్మూలనే లక్ష్యంగా జనవరి 1వ తేది నుంచి 31వ తేది వరకు నిర్వహించిన 12వ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో మొత్తం 58 మంది బాలబాలికలను రిస్క్యూ చేసి సంరక్షణలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. రిస్క్యూ చేయబడిన వారిలో 9 మంది బాలికలు, 49 మంది బాలురు ఉన్నారని తెలిపారు. వీరిలో 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకున్న యజమానులపై 11 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలను పనిలో పెట్టుకున్నందుకు 38 మంది యజమానులపై జిల్లా లేబర్ ఆఫీసర్ ద్వారా ఐఆర్ నమోదు చేసి, చట్టప్రకారం జరిమానాలు విధించడం జరిగిందని వివరించారు.

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ..

కొంతమంది పిల్లలు సొంత కుటుంబ పనులు లేదా సొంత దుకాణాల్లో పనిచేస్తున్నట్లు గుర్తించడంతో, వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC)కి అప్పగించగా, సిడబ్ల్యుసి సభ్యులు పిల్లల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి, పిల్లలను చదువుల వైపు మళ్లించేందుకు సూచనలు చేసి పంపించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఆపరేషన్‌ స్మైల‌లో టీం–ఏ తరపున ఎస్‌ఐ కేశవరావు, ముగ్గురు పీసీలు, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మహేష్ కుమార్ (ఏసీఎల్), డీసీపీయు నుంచి రవి (పీఓఎన్‌ఐసీ), పద్మ (ఎస్‌డబ్ల్యూ), ప్రకాష్ (ఓఆర్‌డబ్ల్యూ), చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నుంచి శివలీల (కోఆర్డినేటర్), ఆర్డీఎస్ (ఎన్‌జీవో) నుంచి చంద్రశేఖర్ (కోఆర్డినేటర్)లు పాల్గొనడం జరిగిందన్నారు.

Also Read: Gatha Vaibhava OTT : ఆషికా రంగనాథ్ కన్నడ రొమాంటిక్ ఫాంటసీ డ్రామా తెలుగులో స్ట్రీమింగ్… ఏ ఓటీటీలో ఉందంటే ?

విస్తృతంగా తనిఖీలు..

టీం–బి తరపున ఎస్‌ఐ మురళి, ముగ్గురు పీసీలు, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వేణుగోపాల్ (ఏఎల్‌ఓ), డీసీపీయు నుంచి శివయ్య (ఎల్‌సీపీఓ), సురేష్ (కౌన్సిలర్), లక్ష్మీదేవి (ఓఆర్‌డబ్ల్యూ–ఎఫ్), చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నుంచి జయన్న (కౌన్సిలర్), ఆర్డీఎస్ (ఎన్‌జీవో) నుంచి మద్దిలేటి (సీఎస్‌ఎం)లు విస్తృతంగా తనిఖీలు చేపట్టారన్నారు. బాల కార్మికత్వం సమాజానికి ముప్పుగా మారుతుందని, పిల్లల భవిష్యత్తును రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ తరహా అక్రమాలపై ఇకపై కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు సహకరించాలని కోరారు.

Also Read: Municipal Elections: మిర్యాలగూడ కాంగ్రెస్‌లో రగులుతున్న రాజకీయం.. పుర పోరులో ఓ ఎమ్మెల్యే కుటుంబం..?

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×