E-Paper
Advertisement

Pawan Kalyan Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లోకి పవన్ ఎంట్రీ.. ఫ్యాన్స్ గ్రాండ్ వెల్‌కమ్..

Pawan Kalyan Instagram :  ఇన్‌స్టాగ్రామ్‌లోకి పవన్ ఎంట్రీ.. ఫ్యాన్స్ గ్రాండ్ వెల్‌కమ్..
Advertisement
pawan

Pawan Kalyan Official Instagram Account(Tollywood Celebrity News) : చాలామంది నటీనటులు ఎంతమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నా వారితో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండడం కోసం సోషల్ మీడియాను ఆశ్రయించడానికి ఇష్టపడరు. ఇప్పటికే ప్రతీ సినీ పరిశ్రమలో క్రేజ్ ఉన్నా కూడా సోషల్ మీడియాలో మెయింటేయిన్ చేయని హీరోలు కొందరు ఉంటారు. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. కానీ తాజాగా పవన్.. ఇన్‌స్ట్రాగ్రామ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ అంతా చకచకా ఫాలో బటన్ కొట్టేస్తున్నారు.

Advertisement

వపన్ కళ్యాణ్.. సినిమాల్లో ఎంత ఎనర్జీతో కనిపిస్తారో.. రాజకీయాల్లో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటారు. పవర్ స్టార్‌కు సంబంధించిన సినీ, రాజకీయ విషయాల గురించి ఆయన టీమ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నా కూడా తన పేరు మీద కొన్నిరోజుల క్రితం వరకు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. కొన్నాళ్ల క్రితమే ట్విటర్‌లోకి అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. అప్పటివరకు తన భావాలను, ఫ్యాన్స్‌తో పంచుకోవాలి అనుకుంటున్న విషయాలను ఎక్కువగా ఫేస్‌బుక్‌లోనే పంచుకునేవారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారని తెలిసిన ఫ్యాన్స్ అంతా తనకు గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికారు. అకౌంట్ క్రియేట్ చేసిన నిమిషంలోనే 1 వేయి ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు పవన్. ఆ తర్వాత సెకను సెకనుకు తన ఫాలోవర్స్ కౌంట్ పెరుగుతూనే ఉంది. ఇక ఈ స్పీడ్‌తో కొనసాగితే.. ఒక్కరోజులోనే మిలియన్ ఫాలోవర్స్‌ను దక్కించుకునే అవకాశం ఉందని నెటిజన్లు భావిస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం సినిమాలకంటే ఎక్కువగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. తన ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువగా రాజకీయ విషయాలు పంచుకోవడానికే ఉపయోగిస్తాడని అందరూ అనుకుంటున్నారు. అంతే కాకుండా తన ఇన్‌స్టాగ్రామ్ బయో కూడా రాజకీయానికి సంబంధించిందే పెట్టాడు. ‘ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో’ అనే బయోతో పవన్ కళ్యాణ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్.. ఫ్యాన్స్‌ను పలకరించనుంది. ట్విటర్‌లో ఉన్న ప్రొఫైల్ పిక్చర్‌తోనే ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా ఓపెన్ చేశాడు పవన్.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×