E-Paper
Advertisement

Monda Market: ఆవుల చోరీ కేసులో పోలీసులు ఓవర్ యాక్షన్.. అసలు నిజాలివే.. తప్పంతా వాళ్లదే..?

Monda Market: ఆవుల చోరీ కేసులో పోలీసులు ఓవర్ యాక్షన్.. అసలు నిజాలివే.. తప్పంతా వాళ్లదే..?

Monda Market: ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల మోండా డివిజన్ బండి మెట్, సెకండ్ బజారులో ఇటీవల ఆవుల చోరీ జరిగింది. కొంత మంది దొంగలు ఖరీదైన కారుల్లో వచ్చి ఆవులను కార్లలో వేసుకుని పారిపోయారు. ఆవులను హింసిస్తూ ఇన్నోవా, హెర్టిగా కారుల్లో తీసుకువెళ్లారు. రెండు చోట్ల ఇదే ఘటన చోసుకోవడంతో స్థానిక ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇందులో ముఠా ఆవులను ఎత్తుకు వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. సిటీలో పలు ప్రాంతాల్లో గోవులకు మత్తు మందు ఇచ్చి కార్లల్లో తరలిస్తున్నట్టు బయటపడింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ వీడియోలు కూడా సోషల్  మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కేసులో పోలీసులు ఆ ముఠాను అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది.

సికింద్రాబాద్ మార్కెట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆవుల చోరీ కేసులో పోలీసులు ఓవర్ యాక్షన్ తాజాగా బయటపడింది. ఆవుల దొంగతనం వీడియోలు ప్రసారం చేయొద్దంటూ ఆంక్షలు విధించారు.  పోలీసుల నైట్ గస్తీ నిర్లక్ష్యంతోనే ఆవులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి దొంగలించే సంఘటనలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.  గతంలో చోరీలు జరిగాయని మీడియా సమావేశంలో స్వయంగా పోలీసులు చెప్పేశారు. తాజాగా ఆవుల దొంగతనం జరిగింది వాస్తవమంటూ నార్త్ జోన్ డీసీపీ పెరుమాళ్ పూర్తి వివరాలు వెల్లడించారు. దొంగల కోసం గాలిస్తున్నామని.. టీమ్ ఏర్పాటు చేశామని చెప్పిన చెప్పారు.

ALSO READ: Uttam Kumar Reddy: లోకేష్ ఏం మాట్లాడుతున్నవ్.. కొంచెం ఆలోచించు కదా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

నైట్ గస్తీ పెంచకుండా, పెట్రోలింగ్ నిర్లక్ష్యంతో ఆవుల దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దర్జాగా కారులో వచ్చి దొంగలు ఆవులను ఎత్తుకెళ్తున్నారని.. పోలీసులకు పలు మార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని అంటున్నారు. నగరంలో ఇప్పటికే రెండు చోట్లా ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. గత మూడు రోజులుగా ఆవుల ఎత్తుకెళ్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ALSO READ: Karachi Hotels: కరాచీలోని ఆ హోటళ్లకు వెళ్లకండి.. వణికిపోతున్న అమెరికా, అసలు ఏమైంది?

ఆవుల దొంగలించిన కేసులో దొంగలను పెట్టుకోకుండా పలు మీడియా సంస్థలపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేయడం ఎంతవరకు కరెక్ట్ నెటిజన్లు నిలదీస్తున్నారు. ఎలాంటి విద్వేషాలు, మతాల అంశాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేకున్నా అక్రమ కేసులు పెడుతున్నట్టు తెలుస్తోంది. దొంగలను పట్టుకోకుండా పట్టుకుంటామని ప్రెస్ మీట్ డీసీపీ ఆర్భాటంగా చెప్పిన విషయం తెలిసిందే. నిందితుల సమాచారం తెలపకుండా ప్రెస్ మీట్ పెట్టి డీసీపీ ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదని స్థానికులు అంటున్నారు. పోలీసుల నెగ్లిజెన్సీతోనే రాత్రి పూట దొంగతనాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మార్కెట్ పోలీసు స్టేషన్ లో ఆవుల దొంగతనాలు ప్రసారం చేశారని పోలీసులు, జర్నలిస్టులను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×