E-Paper
Advertisement

Raghunandanrao : కీలక పోస్టుల్లో తెలంగాణ అధికారులు ఉన్నారా?.. డీజీపీని ఏపీకి పంపాల్సిందే: రఘునందన్

Raghunandanrao : కీలక పోస్టుల్లో తెలంగాణ అధికారులు ఉన్నారా?.. డీజీపీని ఏపీకి పంపాల్సిందే: రఘునందన్

Raghunandanrao : ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ కేటాయింపుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరిని బీజేపీ తప్పుపడుతోంది. ఏపీ కేడర్‌కు చెందిన డీజీపీ అంజనీ కుమార్‌ను వెంటనే ఆ రాష్ట్రానికి పంపాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఐపీఎస్‌ల పోస్టింగుల్లో తెలంగాణ అధికారులకు అన్యాయం జరిగిందన్నారు. కీలక పోస్టుల్లో ఒక్క తెలంగాణ అధికారిని కూడా ప్రభుత్వం నియమించలేదని మండిపడ్డారు.

తెలంగాణ ఐపీఎస్‌లకు న్యాయం చేయాలని రఘునందన్‌ రావు డిమాండ్‌ చేశారు. ఇటీవల జరిగిన 93 మంది ఐపీఎస్‌ల బదిలీల్లో రాష్ట్రానికి చెందినవారికి అన్యాయమే జరిగిందన్నారు. నాలుగు కీలక పోస్టులను బిహార్‌ కు చెందిన అంజనీకుమార్‌, సంజయ్‌కుమార్‌ జైన్‌, షానవాజ్‌ ఖాసిం, స్వాతి లక్రాకు ఇచ్చారని మండిపడ్డారు.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన అధికారులు చాలామంది ఇప్పటికే తెలంగాణలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవల హైకోర్టు తీర్పుతో సీఎస్ పదవి నుంచి సోమేష్ కుమార్ తప్పుకోవాల్సి వచ్చింది. ఆయనను రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఏపీకి కేటాయించింది. క్యాట్ ఉత్తర్వులతో మొన్నటి వరకు తెలంగాణలో కొనసాగారు. హైకోర్టు తీర్పురాగానే …కేంద్రం ఏపీకి వెళ్లాల్సిందేనని ఆదేశించడంతో ఆ రాష్ట్రానికి వెళ్లి రిపోర్ట్ చేశారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ ను కూడా రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించారు. ఆయన కూడా క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్నారు. అంజనీకుమార్ ను తెలంగాణలో కొనసాగించడంపై హైకోర్టు తీర్పు త్వరలోనే రానుంది. ఈ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Tags

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×