Madhapur: హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో ఘోరం జరిగింది. ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటన గురించి తెలియగానే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని శిధిలాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఘటన ఎలా జరిగింది?
శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ సిటీలో గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో ఏడు అంతస్తుల భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీని ఆ భవనం శిధిలాలు పక్కనే ఉన్న అపార్ట్ మెంటుపై పడ్డాయి. నిర్మాణ పూర్తయి అద్దెకు ఇచ్చేందుకు రెడీగా ఉంది కొత్త భవనం. ఇంతలోనే ఒక్కసారిగా కూలిపోయింది. భవన శిధిలాలు తగిలి ఇద్దరు గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు.
వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో కూలిన భవనం పక్కనేవున్న హాస్టల్ నుంచి పలువురు వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. నాలాను ఆనుకున్న 50 గజాల స్థలంలో ఇటీవలే ఏడు అంతస్తుల భవన నిర్మాణం పూర్తయ్యింది. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉండొచ్చనే అనుమానంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ భవనం యజమాని ఎవరు అనేది ఇంకా గుర్తించాల్సివుంది.
భవనం కూలిన ప్రాంతం అంజయ్యనగర్ పరిధిలోకి వస్తుంది. గాయపడినవారిలో మాజీ ఆర్మీ అధికారి ఉన్నట్లు సమాచారం. ఆయన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందినవారి మృతదేహాలను వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతోంది. మృతిచెందినవారు మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందినవారు. ఉమేష్-(34), మోపత్-(42) గుర్తించారు. టైల్స్ కార్మికులుగా పని చేస్తూ కొండాపూర్లో ఉంటున్నారు.
ప్రమాదం జరిగిన భవనం బయట ఖాళీ స్థలం ఉంది. సాయంత్రం అయ్యేసరికి చిన్నారులు అక్కడే రకరకాల ఆటలు ఆడుతుంటారు. మధ్యాహ్నం సమయంలో ప్రాణ నష్టం తగ్గిందని, అదే సాయంత్రం వేళ జరిగితే ఎక్కువగా ఉండేదని అపార్టుమెంటు వాసులు చెబుతున్నారు. భవనం శిథిలాల పనులను పోలీసులు, జీహెచ్ఎంసీ, ఫైర్ సేఫ్టీ, దగ్గరుండి చేయిస్తున్నారు. ఈ ఘటనతో చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులు బెంబేలెత్తుతున్నారు.
ALSO READ: బీసీ రిజర్వేషన్లపై మోదీ-అమిత్ షా కుట్ర-వీహెచ్
ఇదే అంజయ్యనగర్లోని గతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిన విషయం తెల్సిందే. అనుమతి లేకుండా నిర్మించిన భవనాల వల్ల తరచు కూలిన ఘటనలు జరగడంపై ఆందోళన చెందుతున్నారు. భవన నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని ఇరుగుపొరుగు వాసుల ఆరోపణ. పక్కనున్న అపార్ట్మెంటు గోడలు, ఫ్లాట్లలో సామాగ్రి ధ్వంసమైంది.