Prisoner Escape: సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో భద్రతా లోపం కలకం రేపింది. వైద్య పరీక్షల నిమిత్తం జైలులో నుంచి ఏడుగురు ఖైదీలను పోలీసులు ఆస్పత్రికి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా గతంలో బైక్ దొంగతనాల కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సాయికుమార్ అనే ఖైదీ పోలీసులను తప్పించుకుని పరార్ అయ్యాడు. దీంతో ఈ సంఘటన కలకం రేపుదుంది.
సిద్దిపేటలో ఖైదీ పరార్ అవ్వడంతో ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతరం తప్పించుకున్న ఖైదీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆసుపత్రి నుండి పరారైన సాయి కుమార్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో అన్ని దారుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read: నిరసన ఒక హక్కు.. శుభ్రత ఒక బాధ్యత.. జంతర్ మంతర్ను అద్దంలా మార్చిన జెన్ జెడ్
పట్టపలే పోలీసుల కల్లుగప్పి తప్పించుకోండంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులపై కొంత మంది వ్యక్తుల అబద్రత అనే బావం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల యోక్క బద్రత వైఫల్యం ఎంత దారుణంగా ఉందో ఈ సంఘటనే నిదర్శనం అని కొంత మంది వ్యక్త పరుస్తున్నారు. పోలీసులకు సైతం ఈ సంఘటన వ్యవస్ధకే ఓక చాలెంజ్ లాగా మారిపోయింది.
Also read: Rythu Bima: తెలంగాణ రైతులకు షాకింగ్ న్యూస్.. ఆగిపోనున్న రైతు బీమా పథకం!