BigTV English

Bhadrachalam encounter: భద్రాచలంలో ఎన్‌కౌంటర్, ఆరుగురు మావోలు మృతి.. అగ్రనేతలు?

Bhadrachalam encounter:  భద్రాచలంలో ఎన్‌కౌంటర్, ఆరుగురు మావోలు మృతి.. అగ్రనేతలు?

Bhadrachalam encounter: మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా భద్రాచలం జిల్లా కరకగూడెం మండలం రఘునాథ‌పాలెం ప్రాంత సమీపంలో గురువారం ఉదయం కాల్పులు జరిగాయి. మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో తెలంగాణకు చెందిన అగ్రనేతలున్నట్లు తెలుస్తోంది.


ఓ వైపు ఎన్‌కౌంటర్లు.. మరోవైపు కూంబింగ్‌తో మావోలను హడలెత్తిస్తున్నారు పోలీసు బలగాలు. దీంతో ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోకి వచ్చేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగా  ఆదిలోనే వారికి ఊహించని ఎదురు‌దెబ్బ తగిలింది.

ALSO READ: ఉమ్మడి ఆదిలాబాద్.. జైనూరులో అల్లర్లు.. 144 సెక్షన్ విధింపు.. అసలేం జరిగింది?


ఏజెన్సీల్లో పార్టీ విస్తరణ కోసం గ్రూపులుగా ఏర్పడ్డారు మావోయిస్టులు. పార్టీలో చేరికలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో భద్రాచలం జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాలను ఎంచుకున్నారు. దీనిపై నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందడంతో కూంబింగ్ మొదలుపెట్టారు.

కరకగూడెం అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం మావోయిస్టులు-పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మృతుల్లో మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్నతోపాటు అదే దళానికి చెందిన ఆరుగురు ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు గ్రేహౌండ్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి.

రఘునాథపాలెం ఏరియాలో ఈ దళం కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఈ దళానికి లచ్చన్న నాయకత్వం వహిస్తున్నాడు. మరోవైపు మావోయిస్టులకు వరుసగా కోలుకోని దెబ్బలు తగులుతున్నాయి. రెండురోజుల కిందట ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-బీజాపూర్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఘటనలో తొమ్మిది మంది మావోయిస్టులు మరణించిన విషయం తెల్సిందే.

Related News

Hyderabad Water Cut: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. నగరంలో రెండు రోజులు తాగునీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాలపై ఎఫెక్ట్

Telangana: భయం గుప్పిట్లో చందనపల్లి గ్రామం.. నెల రోజుల్లో 20 మంది బలి

CM Progress Report: దేశానికే ఆదర్శం టీ -ఫైబర్.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తెలంగాణ

Telangana Bandh: ఈనెల 14న తెలంగాణ రాష్ట్రా బంద్.. ఎందుకంటే..?

Global Study Expo 2025: గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో- 2025, తక్కువ ఖర్చుతో విదేశీ విద్య, స్టూడెంట్స్ మాటల్లో

Hyderabad Accident: ఎల్‌బీనగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం, బైక్‌ని ఢీ కొట్టిన కారు, నుజ్జుయిన కారు

Innovation Hub: ఈ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు: శ్రీధర్ బాబు

Vemulawada Temple: రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు.. రేపటి నుంచి భీమేశ్వరాలయంలో దర్శనాలు

Big Stories

×