E-Paper
Advertisement

Sri Rama Pattabhishekam: భద్రాచలంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం..!

Sri Rama Pattabhishekam: భద్రాచలంలో వైభవంగా  శ్రీరామ పట్టాభిషేకం..!

శ్రీరాముడు అరణ్యవాసం నుంచి తిరిగిరాగానే, కైకేయి పుత్రుడైన భరతుడు, రాముడిని సమీపించి తండ్రిమాట నిలబెట్టడంకోసం తృణప్రాయంగా రాజ్యాన్ని విడిచి, నాకు అప్పగించి ఎలా వెళ్లావో.. అలా ఆ రాజ్యాన్ని మళ్లీ నీ పాదాల చెంత పెట్టేస్తున్నాను అన్నాడు. ఆ మాటలకు శ్రీరాముడు సంతోషించి, తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరిస్తాడు.

శ్రీరాముడు 14 ఏళ్ల అరణ్యవాసం పూర్తయి అయోధ్యా నగరానికి వచ్చిన తర్వాత తండ్రి దశరథుడు శ్రీరామునికి పట్టాభిషేకం జరిపించాలని నిర్ణయించాడు. చైత్రశుద్ధ దశమి, పుష్యమి నక్షత్రంలో శ్రీరామునికి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిపించాడు.

Also Read: తెలంగాణలో మరో సమరం, బరిలో ముగ్గురు మొనగాళ్లు

దశరథుని మూడవ భార్య కైకేయిని వివాహం చేసుకునేముందు ఆమెకు పుట్టే సంతానానికి పట్టాభిషేకం చేయాలని ఆమె తండ్రి కైకేయరాజు కోరగా దశరథుడు అంగీకరిస్తాడు. కానీ చివరికి పెద్ద భార్య కౌసల్య పుత్రుడైన శ్రీరామునికే పట్టాభిషేకం జరిపిస్తాడు.

శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో భద్రాచలం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రాములవారు భక్తకోటికి నేనున్నానంటూ అభయమిచ్చాడు. కల్యాణమూర్తులు శోభాయాత్రగా మిథిలా ప్రాంగణానికి చేరుకోగానే.. జైశ్రీరామ్‌ నినాదాలతో ప్రాంగణమంతా మార్మోగింది. గోదావరి నుంచి తీసుకొచ్చిన పుణ్య జలాలను వైదిక పెద్దలు భక్తులపై చల్లి ఆశీస్సులు అందించారు. సీతమ్మతో కలిసి స్వామివారు రాజాధిరాజుగా దర్శనమిచ్చారు.

మహా పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్. దక్షిణ అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మిథిలా మండపానికి చేరుకుని మహాపట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీ సీతారాముల సేవలో తరించడం తన అదృష్టమన్న గవర్నర్‌.. ప్రజలకు సుభిక్షమైన పాలన అందించడం, సుఖసంతోషాలతో ఉండేలా చూడటమే రామరాజ్య స్థాపన ఉద్దేశమని చెప్పారు.

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×