E-Paper
Advertisement

Telangana Bhavan: తీవ్ర ఉద్రిక్తత.. హరీశ్ రావు, సబితలను అడ్డుకున్న పోలీసులు

Telangana Bhavan: తీవ్ర ఉద్రిక్తత.. హరీశ్ రావు, సబితలను అడ్డుకున్న పోలీసులు
Advertisement

Police stopped BRS MLAs Harish rao, sabitha at Telangana Bhavan: మూసీ పరివాహక బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ బృందం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజక వర్గం హైదర్ షా కోటకు బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్ రావు, సబిత ఇంద్రా రెడ్డిలను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకులకు వాగ్వాదం చోటుచేసుకుంది.

కూల్చివేసిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ కీలక నాయకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే హైదర్ కోట వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం చేరుకోవడంతో తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్ రావు, సబిత ఇంద్రా రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ తీరును, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే హరీశ్ రావు, సబిత ఇంద్రారెడ్డి నేతల ఆధ్వర్యంలో బాధితుల పరామర్శకు బయలుదేరారు.

Advertisement

హరీశ్ రావుతోపాటు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి ఉన్నారు. కాగా, ప్రభుత్వానికి మూసీ పరివాహక ప్రాంతాలతోపాటు స్థానికులు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

Also Read: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృ వియోగం

అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిలో వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ తరఫున న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. కాగా, హైదర్ షా కోట్‌లో బాధితుల ఇళ్లను పరిశీలించారు.

Tags

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×