E-Paper
Advertisement

పొత్తులు లేవు.. ఒంటరిగానే బరిలోకి.. జనసేనకు తెలంగాణ బీజేపీ షాక్!

పొత్తులు లేవు.. ఒంటరిగానే బరిలోకి.. జనసేనకు తెలంగాణ బీజేపీ షాక్!
Advertisement

Ramachander Rao: రాబోయే తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రామచందర్ రావు స్పష్టం చేశారు. జనసేన సహా ఏ పార్టీతో పొత్తుపెట్టుకునేది లేదని తెగేసి చెప్పారు. రాష్ట్ర ముఖ్యనేతలతో కలిసి దిల్లీ వెళ్లిన రామచందర్ రావు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడుతో భేటి అయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారం చేపట్టేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ బీజేపీ జెండాను ఎగురవేస్తామని రామచందర్ రావు అన్నారు. కీలక నేతలు తమ పార్టీలో చేరేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తమ పార్టీలోని నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న రామచందర్ రావు.. ఇన్నాళ్లు భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Also Read: నీట్ లీకేజీ కేసులో బిగ్ ట్విస్ట్.. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో షాకింగ్ విషయాలు!

ప్రతి 3 నెలలకు ఒకసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ తెలంగాణకు వస్తారని రామచందర్ రావు తెలియజేశారు. అటు తెలంగాణలోని ప్రజా సమస్యలపై బీజేపీ యుద్ధం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిదని.. దీనిపై కలిసి పోరాటం చేయాలని నితీన్ నబీన్ దిశా నిర్దేశం చేసినట్లు చెప్పారు. తెలంగాణలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేతో త్వరలో మరోమారు నితీన్ నబీన్ భేటి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

తెలంగాణ ప్రజలకు హై అలర్ట్.. రేపు ఆటోలు, క్యాబ్‌లు, స్విగ్గీ, జొమాటో సేవలు బంద్!

Tags

Related News

రూ.51 లక్షలకు లడ్డు కొని.. రూ.4 కోట్లతో జంప్.. మై హోమ్ భుజాలో క్లాసిక్ మోసం!

విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్.. గన్నవరం మెట్రో లైన్‌పై కీలక ముందడుగు!

వర్షాలకోసం నాగార్జున సాగ‌ర్‌లో సీఎం రేవంత్ వరుణ యాగం!

తెలంగాణ ప్రజలకు హై అలర్ట్.. రేపు ఆటోలు, క్యాబ్‌లు, స్విగ్గీ, జొమాటో సేవలు బంద్!

జగిత్యాల జిల్లాలో గ్యాంగ్ రేప్ కలకలం

నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపుతావా లేదా?.. ప్రియుడితో భార్య చాటింగ్ వైరల్!

మగవాళ్లకు బిగ్ రిలీఫ్ .. గ్రేటర్ పరిధిలో కొత్తగా 75 సిటీ బస్సులు

Big Stories

Advertisement
×