Vijayawada Metro: విజవాడ మెట్రో పనిలో కీలక పనులకు ముందడుగు పడింది. మెట్రో కోసం ఎర్పాటు చేసిన కమిటీల్లో భాగంగా కీలక అడుగు ముందుకు పడింది. విజయవాడ టూ గన్నవరం వరకు సర్వేలో కీలక అంశం క్లియర్ అయింది. స్టేషన్ల ఏర్పాట్లకోసం భూ సర్వేలో ముందడుగు పడింది. రెవెన్యూ అధికారులతో పాటు మెట్రో అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వేలు చేపట్టారు. ఆ సర్వేలో గన్నవరం ఆర్టీసీ బస్టావడ్ వద్ద ప్రారంభంకానన్న కారిడార్లో కేసరపల్లిలో మెట్రో డిపో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సుమారు 61 ఎకారల భూమి అవసరంగా ఉండగా నాలుగు స్టేషన్ల నిర్మానానికి అదనపు భూమిని గుర్తించారు. గన్నవరం బస్టాండ్, బుద్దవరం రోడ్డు కేసరపల్లి జక్షన్ వద్ద మోత్తం నాలుగు స్టేషన్లను ఎర్పాటు చేయాలని ప్రతిపాదనలను సిద్దం చేసారు. పదేళ్లనుండి వేచిచూస్తున్న బెజవాడ మోట్రో ఈ సారైన క్లియర్ అవుతుందో వేచి చూడాలి.
Also Read: దుమ్ము లేని ఇల్లు కావాలా ? రూ.30వేలలోపు టాప్ 5 రోబోట్ వాక్యూమ్ క్లీనర్లు!
ఏపీలో ప్రదాన నగరాల్లో రోజు రోజుకు జనాబా పెరగడంతో ప్రదాన నగరాల్లో జనాబా, వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో కొంత ఇబ్బందులను ప్రజలు ఫేస్ చేస్తున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించుకోండం కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక ముందడుగు వేసింది. దీనిలో భాగంగానే విజయవాడ నగరంలో అధునాతన మెట్రో రైలు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గతంలో 2024 సంవత్సరంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో విశాఖపట్నంతో పాటు విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ALSO Read: 95 ఏళ్ల తాత చివరి కోరిక కోసం పాక్ కు మనవడు… కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్