Telangana Strike: రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆటో, క్యాబ్, స్విగ్గీ, జొమాటో, జెప్టో అన్నీ బంద్కు పిలుపునిచ్చారు. మోత్తం 16 వాహన సంఘాలు కలిపి రేపు నిరవదిక సమ్మే చేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ తమ సమస్యలపై పట్టించుకోవడం లేదని సంఘాల నాయకుల వాపోయారు. అందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు యూనియన్ నాయకులు ప్రకటించారు.
ఆటో, క్యాబ్, లారీ, ఓలా, ర్యాపిడో, ఉబర్, స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇన్స్టామార్ట్ తదితర డెలివరీ సేవలు అన్నీ బంద్ చేస్తామని జేఏసీ సంఘం తెలిపింది. ఇప్పటివరకు చాలాసార్లు సీఎం దృష్టికి తమ సమస్యలు తీసుకెల్లామని అయినా ప్రభుత్వానికి మా విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదని వాపోయారు. యాప్ ఆధారిత రవాణా సేవలకు ప్రభుత్వం, ప్లాట్ఫారం కంపెనీలు కలిసి కనీసం బేస్ఫేర్తో పాటు ప్రతి కిలోమీటరుకూ, ప్రతి నిమిషానికీ న్యాయమైన చార్జీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో యాప్ ఆధారిత డ్రైవర్లు, డెలివరీ వర్కర్లు, అన్ని గిగ్, ప్లాట్ఫారం కార్మికులకు స్థిరమైన ఆదాయం లభించేలా చూడాలని తెలిపారు.
Also Read: నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపుతావా లేదా?.. ప్రియుడితో భార్య చాటింగ్ వైరల్!
తెలంగాణ రాష్ట్రంలో గిగ్, ప్లాట్ఫారం వర్కర్స్ రూల్స్ను వెంటనే నోటిఫై చేసి, వెల్ఫేర్ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని నాయకుల డిమాండం చేస్తున్నారు. మోటర్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు 2025 సైతం పూర్తిగా అమలు చేసి, రాష్ట్ర ప్రభుత్వం కనీస చార్జీలను అమలు చేయాలని కోరుతున్నారు. మోటర్ వెహికల్స్ చట్టం-1988, మోటర్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2025 ప్రకారం కమర్షియల్ రిజిస్ట్రేషన్ను మార్చకుండా ప్రైవేట్, ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలను యాప్ ఆధారిత ప్రయాణికుల లేదా సరుకు రవాణా సేవలకు ఉపయోగించడాన్ని నిషేధించాలని వాహనస సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: రాజమండ్రి మెడికో డాక్టర్ ప్రియాంక కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితులపై కోర్టు సంచలన తీర్పు!