Health Scheme: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ ఫండ్కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బేసిక్ పే, పెన్షనర్ల బేసిక్ పెన్షన్ నుంచి 1.5 శాతం మొత్తాన్ని ఈహెచ్ఎస్ ఫండ్ కోసం మినహాయించాలని (కట్ చేయాలని) రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు విడుదల చేశారు. 2026 మే నెలకు సంబంధించిన జీతాలు/పెన్షన్ల (జూన్ నెలలో చెల్లించేవి) నుంచే ఈ కటింగ్లు అమల్లోకి వస్తాయని, ఇకపై ప్రతి నెలా ఇది కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Also read: అల్లరి నరేష్ ఇప్పటివరకు చూడని తన సినిమా ఏంటో తెలుసా?
ఉద్యోగులు, పెన్షనర్లు ఇచ్చే 1.5 శాతం కాంట్రిబ్యూషన్కు సమానంగా (ఈక్వల్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్) ప్రభుత్వాన్నే నిధులను సమకూరుస్తుంది. ఈ మొత్తాన్ని కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్’ పర్యవేక్షిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక కేసుల్లో కేవలం ఒక్కరి నుంచి మాత్రమే ఈ 1.5 శాతం కటింగ్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. భార్యాభర్తల కేసుల్లో ఈ రూల్ వర్తింపజేయనున్నారు.
Also read: ఈ చిన్న ట్రిక్ తెలిస్తే.. ఏడాది పొడవునా ఫ్రెస్ మామిడి పండ్లు తినొచ్చు.. ఎలాగంటే?