E-Paper
Advertisement

Ration cards: రేషన్ కార్డులపై మూడో కన్ను.. అలాంటి వారివి తొలగింపు

Ration cards: రేషన్ కార్డులపై మూడో కన్ను.. అలాంటి వారివి తొలగింపు
Advertisement

Ration cards: తెలంగాణలో రేషన్‌కార్డు దారులకు షాక్ తగలనుందా? నకిలీ కార్డుల ఏరివేత మొదలైందా? ఆరునెలలుగా రేషన్ తీసుకోకుంటే కార్డు పోయినట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.  కేంద్రం ఆదేశాలతో తెలంగాణ సర్కార్ కార్డు దారులపై ఫోకస్ చేసింది.

రేషన్ కార్డులున్నా నిత్యావసరాలు తీసుకోనివారిపై కొరడా ఝులిపించనుంది కేంద్రప్రభుత్వం. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు లక్షన్నరకు పగానే రేషన్ కార్డులు యాక్టివ్‌గా లేవన్నది కేంద్రం మాట. గడిచిన ఆరునెలలుగా వారంతా రేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. ఆయా కార్డుదారులపై విచారణ చేపట్టాలని కేంద్రప్రభుత్వం తెలంగాణ పౌర సరఫరాల శాఖను ఆదేశించింది.

Advertisement

దీంతో రంగంలోకి దిగింది యంత్రాంగం. ఇప్పటివరకు 80 శాతం కార్డులను పరిశీలించారు అధికారులు. మిగతావాటిలో 20 శాతం అనర్హులుగా గుర్తించారు. ఆయా కార్డుదారులపై విచారణ దాదాపుగా పూర్తికానుంది. వాటిని రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

మరోవైపు అధికారులు పరిశీలించిన రేషన్‌కార్డు వినియోగదారులు కొందరు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు సమాచారం. మరికొందరు లబ్ధిదారులు మరణించినా ఆయా వివరాలు అప్డేట్ కాలేదు. ఇంకొందరికి ఆధార్ వివరాలు తప్పుగా ఉన్నాయి. ఆ తరహా లోపాలుండే కార్డులను తొలగించే అవకాశముంది.

Advertisement

ALSO READ: బీఆర్ఎస్ పక్కా ప్లాన్, ప్రభాకర్‌రావు నోరు విప్పితే వాళ్లు జైలుకే

కొందరైతే ఈ-కేవైసీ ఇప్పటికీ పూర్తి చేయలేదని అంటున్నారు. కార్డు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు ఏడాది క్రితమే ఈ-కేవైసీ ప్రక్రియను మొదలుపెట్టింది కేంద్రం. రాష్ట్రంలో 90 శాతానికిపైగా పూర్తి చేశారు. వినియోగదారులు రేషన్ ఫాపుకి వెళ్లి ఈ-కేవైసీ పూర్తి చేయాలి. అప్పుడే వారి పేర్లు EPOS మెషీన్లలో కనిపిస్తాయి.

ఈ-కైవేసీ పూర్తి చేయని వారి పేర్లు ఎరుపు రంగులో దర్శనమిస్తున్నాయి. రీసెంట్‌గా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 2 లక్షల రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటితో కలిసి రేషన్ కార్డుదారులు దాదాపు 92 లక్షలకు చేరింది. లబ్ధిదారులు సైతం పెరిగారు.

ప్రజాపాలన దరఖాస్తులతోపాటు మీ-సేవలో అప్లై చేసిన అప్లికేషన్లు పరిశీలించి అర్హత కలిగినవారికి కొత్త కార్డులు మంజూరు చేసింది ప్రభుత్వం. రుతుపవనాలు ముందుగా రావడంతో కేంద్ర సూచనతో తెలంగాణలో మూడు నెలల రేషన్ కలిపి ఒకేసారి ఇస్తున్నారు. కొత్తగా కార్డులు వచ్చినవారు బియ్యం తీసుకోవచ్చు.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×