Heat Advisory: స్వేచ్ఛ బ్యూరోొ: రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రత్యేకంగా సూచించింది. తెలంగాణ వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజారోగ్య ,కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ బి. రవీందర్ నాయక్ ప్రత్యేక అడ్వైజరీ రిలీజ్ చేశారు. అత్యవసరమైతే తప్పా, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యలో బయటకు రావొద్దని సూచించారు.
దాహం వేయకపోయినా సరే, వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగుతూ ఉండాలని కోరారు. ఓఆర్ఎస్ లవణాల నీటితో పాటు నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు వంటి ఇంటి పానీయాలను తీసుకోవాలి. పుచ్చకాయ, కర్బూజా, నారింజ, ద్రాక్ష, అనాస, కీరదోస వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే స్థానిక సీజనల్ పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలన్నారు. పల్చని, వదులుగా ఉండే లేత రంగు కాటన్ (నూలు) దుస్తులను ధరించాలి.
Also read: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల్లో టాప్ 10 ర్యాంకర్స్ వీరే..?
ఎండలోకి వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ, తువ్వాలు లేదా ఏదైనా సాంప్రదాయ తలపాగాతో తలని కప్పుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు కాలికి చెప్పులు లేదా బూట్లు తప్పనిసరిగా ధరించాలి. ఇళ్లను బాగా గాలి ఆడేలా చల్లగా ఉంచుకోవాలని కోరారు. వికారం, వాంతులు చర్మం వేడిగా, ఎర్రగా మారడం, ఆందోళన, తల తిరగడం, శ్వాస వేగంగా కొట్టుకోవడం, కండరాల బలహీనత వంటివి కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
Also read: కవిత ఊహించని స్కెచ్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు?