Voter List Revision: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హులైనటవంటి ఎ ఓక్కరి ఓట్లను కోల్పోకూడదని సీఏం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకుగాను భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 92.86 లక్షల మంది ఓటర్ల వివరాలను కమీషన్ పరిశీలన పెండింగ్లో ఉన్నాయని దీంతో ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేయడానికి కొంత గడువును పొడిగించాలని లేఖలో సీఎం రేవంత్ కోరారు.
ప్రస్తుతం జరుగుతున్న అభ్యంతరాలు గడువును మరో నాలుగు వారాల పాటు పొడిగించాలని సీఎం రేవంత్ లేఖలో పేర్కోన్నారు. దీనితో పాటుగా తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీని ప్రకటించాలని సీఎం కోరారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లకు దిశానిర్థేశం చేసేందుకు బూత్ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని కొరారు.
Also read: రాత్రికి రాత్రే రాక్ స్టార్ శవంగా… తీరా శవం దగ్గరకు వెళ్తే ఊహించని షాక్… డార్క్ హారర్ థ్రిల్లర్
తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎక్కువగా ఉన్న హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో సరిపడా అధికారులను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దీనికి తోడు ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు తెలంగాణ ప్రభుత్వం నుండి పరిపాలనాపరంగా మా వంతు సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Also read: వెలిగొండ ఇష్యూ.. తెలంగాణ-ఆంధ్ర జల వివాదం