Two Died of Sunstroke in Telangana : ఎండలు మండిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోత, మరోవైపు తీవ్ర వడగాలులు ప్రజలకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఎర్రటి ఎండలో బయటికెళ్తే.. దాదాపు మృత్యువును దగ్గరగా చూసినంత పనవుతుంది. కళ్లు బైర్లు కమ్మి.. దిమ్మ తిరిగిపోతుంది. తాజాగా తెలంగాణలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బతో ఇద్దరు మరణించారు.
కొమురం భీం జిల్లాలో ఒకరు, మంచిర్యాల జిల్లాలో మరొకరు మృత్యువాత పడ్డారు. కొమురం భీం జిల్లా, కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారమ్ 2 లో గుర్తుతెలియని వృద్ధుడు వడదెబ్బకు మరణించాడు. అలాగే మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలోని వినాయక్ నగర్ కు చెందిన మేడిశెట్టి మహేశ్ మరణించాడు. కాగా.. గత శుక్రవారం వేములవాడ లోని అచ్చన్నపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న బీహార్ కు చెందిన శంకర్ సదా వడదెబ్బ తగిలి చనిపోయాడు. నల్గొండ జిల్లాలో ప్రైవేట్ టీచర్ మృతి చెందింది.
Also Read : ఏపీలో నెత్తురోడిన రహదారులు.. ఆరుగురు మృతి
వడదెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతుండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణశాఖ. అనవసరంగా బయట తిరగవద్దని, నీడ పట్టున ఉండాలని సూచించింది. రైతులు కూడా ఎండ తక్కువగా ఉన్న సమయాల్లో పనులు పూర్తిచేసుకోవాలని తెలిపింది.