BigTV English

Sunstroke Deaths : వడదెబ్బకు ఇద్దరు మృతి.. దయచేసి బయటకు రాకండి..

Sunstroke Deaths : వడదెబ్బకు ఇద్దరు మృతి.. దయచేసి బయటకు రాకండి..

Two Died of Sunstroke in Telangana : ఎండలు మండిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోత, మరోవైపు తీవ్ర వడగాలులు ప్రజలకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఎర్రటి ఎండలో బయటికెళ్తే.. దాదాపు మృత్యువును దగ్గరగా చూసినంత పనవుతుంది. కళ్లు బైర్లు కమ్మి.. దిమ్మ తిరిగిపోతుంది. తాజాగా తెలంగాణలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బతో ఇద్దరు మరణించారు.


కొమురం భీం జిల్లాలో ఒకరు, మంచిర్యాల జిల్లాలో మరొకరు మృత్యువాత పడ్డారు. కొమురం భీం జిల్లా, కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారమ్ 2 లో గుర్తుతెలియని వృద్ధుడు వడదెబ్బకు మరణించాడు. అలాగే మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలోని వినాయక్ నగర్ కు చెందిన మేడిశెట్టి మహేశ్ మరణించాడు. కాగా.. గత శుక్రవారం వేములవాడ లోని అచ్చన్నపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న బీహార్ కు చెందిన శంకర్ సదా వడదెబ్బ తగిలి చనిపోయాడు. నల్గొండ జిల్లాలో ప్రైవేట్ టీచర్ మృతి చెందింది.

Also Read : ఏపీలో నెత్తురోడిన రహదారులు.. ఆరుగురు మృతి


వడదెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతుండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణశాఖ. అనవసరంగా బయట తిరగవద్దని, నీడ పట్టున ఉండాలని సూచించింది. రైతులు కూడా ఎండ తక్కువగా ఉన్న సమయాల్లో పనులు పూర్తిచేసుకోవాలని తెలిపింది.

Related News

Hyderabad Water Cut: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. నగరంలో రెండు రోజులు తాగునీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాలపై ఎఫెక్ట్

Telangana: భయం గుప్పిట్లో చందనపల్లి గ్రామం.. నెల రోజుల్లో 20 మంది బలి

CM Progress Report: దేశానికే ఆదర్శం టీ -ఫైబర్.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తెలంగాణ

Telangana Bandh: ఈనెల 14న తెలంగాణ రాష్ట్రా బంద్.. ఎందుకంటే..?

Global Study Expo 2025: గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో- 2025, తక్కువ ఖర్చుతో విదేశీ విద్య, స్టూడెంట్స్ మాటల్లో

Hyderabad Accident: ఎల్‌బీనగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం, బైక్‌ని ఢీ కొట్టిన కారు, నుజ్జుయిన కారు

Innovation Hub: ఈ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు: శ్రీధర్ బాబు

Vemulawada Temple: రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు.. రేపటి నుంచి భీమేశ్వరాలయంలో దర్శనాలు

Big Stories

×