E-Paper
Advertisement

Telangana Students Dead in US: అమెరికాలో ఘోరం.. ఇద్దరు తెలంగాణ స్టూడెంట్స్ మృతి..!

Telangana Students Dead in US: అమెరికాలో ఘోరం.. ఇద్దరు తెలంగాణ స్టూడెంట్స్ మృతి..!
Advertisement

2 Telangana Students Dead in America: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. చనిపోయిన ఇద్దరు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. ఈ ఘటనతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కి చెందిన 19 ఏళ్ల గౌతమ్ కుమార్, కరీంనగర్‌కు అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. వీకెండ్ సెలవు కావడంతో స్నేహితులతో కలిసి వీరిద్దరు కారులో వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్తున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో గౌతమ్, నివేశ్ అక్కడికక్కడే చనిపోయారు. ఘటన సమయంలో వీరిద్దరు కారులోని వెనుక సీటులో ఉన్నారు. గాయపడిన మరో విద్యార్థులు స్థానికంగా ఓ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఘటనపై ఆరిజోనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

Advertisement

గౌతమ్‌కుమార్ ఇండియా రావడానికి వచ్చేనెల 22న టికెట్ బుక్ చేసుకున్నాడు. మరో నెలరోజులైతే సొంతూరు రావాల్సివుంది. ఇంతలోనే రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. గౌతమ్ సొంతూరు స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన బంగారం వ్యాపారి కమల్ కుమార్, పద్మ దంపతుల పెద్ద కొడుకు.

Also Read: ఇజ్రాయెల్ సైనికులపై అమెరికా ఆంక్షలు.. ‘ఇదో పిచ్చి చర్య’

Advertisement

మరో స్టూడెంట్ నివేశ్ సొంతపూరు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం. డాక్టర్ స్వాతి, నవీన్ దంపతుల పెద్ద కొడుకు నివేశ్. ఇతడు కూడా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. భవిష్యత్‌కు బాటలు వేసుకుని విదేశాల నుంచి ఇండియా వస్తాడనుకుంటున్న సమయంలో యాక్సిడెంట్ రూపంలో ఇద్దరు స్టూడెంట్స్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×