E-Paper
Advertisement

Bridge Collapsed : ఎనిమిదేళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన.. ఈదురుగాలులకు కూలిన వైనం

Bridge Collapsed : ఎనిమిదేళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన.. ఈదురుగాలులకు కూలిన వైనం

Bridge Collapsed in Telangana : ఎనిమిదేళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన.. భారీ ఈదురుగాలులకు కూలిపోయింది. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది. మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన.. సోమ, మంగళవారం మధ్యరాత్రి వేళ వీచిన ఈదురుగాలులకు కూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

పెద్దపల్లి – భూపాలపల్లి జిల్లాలను కలుపుతూ ఈ వంతెనను నిర్మిస్తున్నారు. రూ.49 కోట్ల బడ్జెట్ లో కిలోమీటరు పొడవున వంతెనను నిర్మించేందుకు 2016లో శంకుస్థాపన చేసింది నాటి ప్రభుత్వం. రెండు జిల్లాల మధ్య రవాణాను మరింత సులభం చేసేందుకు నిర్మించతలపెట్టిన ఈ వంతెనకు శంకుస్థాపన చేసి ఎనిమిదేళ్లు గడిచిపోయింది. వంతెన నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది.

Also Read : నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి.. షాకింగ్ వీడియో!

ప్రాజెక్టులో అవకతవకలు జరగడంతో వంతెన నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. పూర్తయిన పనులకు కూడా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగడంతో.. కాంట్రాక్టర్ వంతెన నిర్మాణాన్ని పూర్తిచేయకుండా ఆపివేసినట్లు తెలుస్తోంది. ఏదేమైన జనసంచారం ఎక్కువగా ఉండని మధ్యరాత్రి వేళ వంతెన కూలిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇదే ఘటన పగటిపూట జరిగి ఉంటే.. ఏమయ్యుండేదోనని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు.

Tags

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×