E-Paper
Advertisement

Bridge Collapsed : ఎనిమిదేళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన.. ఈదురుగాలులకు కూలిన వైనం

Bridge Collapsed : ఎనిమిదేళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన.. ఈదురుగాలులకు కూలిన వైనం
Advertisement

Bridge Collapsed in Telangana : ఎనిమిదేళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన.. భారీ ఈదురుగాలులకు కూలిపోయింది. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది. మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన.. సోమ, మంగళవారం మధ్యరాత్రి వేళ వీచిన ఈదురుగాలులకు కూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

పెద్దపల్లి – భూపాలపల్లి జిల్లాలను కలుపుతూ ఈ వంతెనను నిర్మిస్తున్నారు. రూ.49 కోట్ల బడ్జెట్ లో కిలోమీటరు పొడవున వంతెనను నిర్మించేందుకు 2016లో శంకుస్థాపన చేసింది నాటి ప్రభుత్వం. రెండు జిల్లాల మధ్య రవాణాను మరింత సులభం చేసేందుకు నిర్మించతలపెట్టిన ఈ వంతెనకు శంకుస్థాపన చేసి ఎనిమిదేళ్లు గడిచిపోయింది. వంతెన నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది.

Advertisement

Also Read : నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి.. షాకింగ్ వీడియో!

ప్రాజెక్టులో అవకతవకలు జరగడంతో వంతెన నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. పూర్తయిన పనులకు కూడా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగడంతో.. కాంట్రాక్టర్ వంతెన నిర్మాణాన్ని పూర్తిచేయకుండా ఆపివేసినట్లు తెలుస్తోంది. ఏదేమైన జనసంచారం ఎక్కువగా ఉండని మధ్యరాత్రి వేళ వంతెన కూలిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇదే ఘటన పగటిపూట జరిగి ఉంటే.. ఏమయ్యుండేదోనని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×