E-Paper
Advertisement

Tamil Nadu Bus Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..

Tamil Nadu Bus Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..

Tamil Nadu Bus Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువత్తూర్ జిల్లా వానియంబడి.. చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిలో ఈరోజు తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు- ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరో 40 మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాల పోస్టుమార్టానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.

ఈ ప్రమాదంలో కనీసం ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మృతుల్లో ఉలుందూరుపేటకు చెందిన ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఎలుమలై ఉన్నారు. మృతుల్లో కోలార్‌కు చెందిన ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ మహ్మద్‌ నదీమ్‌, వాణియంబడికి చెందిన ప్రైవేట్‌ బస్‌ క్లీనర్‌ మహ్మద్‌ బైరోస్‌ , చిత్తూరు చెందిన అజిత్‌ కుమార్‌ , చెన్నైకి చెందిన కృతిక అనే మహిళ ఉన్నారు.

అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని బస్సులోని ప్రయాణికులు వెల్లడించారు. పోలీసులు ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

.

.

.

Related News

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Big Stories

×