E-Paper
Advertisement

పర్వతాల నుంచి ఎడారుల వరకు.. దేశంలో కచ్చితంగా చూడాల్సిన 8 బెస్ట్ ప్లేసెస్ ఇవే!

పర్వతాల నుంచి ఎడారుల వరకు.. దేశంలో కచ్చితంగా చూడాల్సిన 8 బెస్ట్ ప్లేసెస్ ఇవే!
Advertisement

Incredible Indian Destinations: దేశం అంటే కేవలం చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, బీచ్‌లు మాత్రమే కాదు. మంచుతో కప్పుకున్న పర్వతాల నుంచి ఎడారి ప్రాంతాల వరకు, ప్రశాంతమైన బ్యాక్‌ వాటర్స్ నుంచి సందడిగా ఉండే నగరాల వరకు ఎన్నో రకాల అనుభూతులను అందించే ప్రదేశాలు దేశంలో ఉన్నాయి. వాటిలో టాప్ 8 ప్లేసెస్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం..

1.ఢిల్లీ, చరిత్రకు అద్దం

దేశ రాజధాని ఢిల్లీలో ఆధునిక జీవితం ఎంత వేగంగా సాగుతుందో, చరిత్ర కూడా అంతే బలంగా కనిపిస్తుంది. మొఘల్ కాలం నాటి స్మారక చిహ్నాలు, పాత కోటలు, చారిత్రక నిర్మాణాలు నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. చరిత్రను ఇష్టపడేవారికి ఢిల్లీ మంచి డెస్టినేషన్.

2.డార్జిలింగ్, టీ తోటల మధ్య ప్రయాణం

Advertisement

బెంగాల్‌ లోని డార్జిలింగ్ ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. కొండల మధ్య విస్తరించిన టీ తోటలు, చల్లని వాతావరణం, పాపులర్ టాయ్ ట్రైన్ ప్రయాణం ఆకట్టుకుంటుంది. ఉదయం వేళ కొండలపై కనిపించే దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

3.వారణాసి, గంగా ఒడ్డున ఆధ్యాత్మిక అనుభూతి

వారణాసి నగరానికి గంగానది ప్రత్యేక గుర్తింపు. సాయంత్రం సమయంలో ఘాట్‌ల వద్ద జరిగే గంగా హారతి చూడటానికి దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. నది ఒడ్డున వెలిగే దీపాలు, పురాతన వీధులు నగరానికి ప్రత్యేకమైన వాతావరణాన్ని అందిస్తాయి.

4.ఉదయ్‌ పూర్, సిటీ ఆఫ్ లేక్స్   

Advertisement

రాజస్థాన్‌ లోని ఉదయ్‌పూర్‌ను లేక్స్ ఆఫ్ సిటీగా పిలుస్తారు. సరస్సుల మధ్య కనిపించే రాజభవనాలు, పాత కోటలు, రాజస్థానీ నిర్మాణ శైలి ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా కొనసాగుతుంది. ప్రశాంతమైన విహారయాత్రకు బెస్ట్ ప్లేస్ గా చెప్పుకోవచ్చు.

5.గోవా, బీచ్‌లు

గోవా అంటే ముందుగా గుర్తుకొచ్చేది సముద్రతీరాలు. అయితే, బీచ్‌లతో పాటు పోర్చుగీస్ కాలం నాటి చర్చిలు, పాత భవనాలు, స్థానిక సంస్కృతి కూడా ఆకట్టుకుంటుంది.

6.మేఘాలయ, చెట్ల వేళ్ల వంతెనలు

మేఘాలయలోని  చెట్ల వేరు వంతెనలు ఆకట్టుకుంటాయి. చెట్ల వేర్లను ఉపయోగించి స్థానికులు రూపొందించిన ఈ వంతెనలు కాలక్రమంలో మరింత బలంగా మారాయి. పచ్చని అడవులు, జలపాతాలు కూడా ఆకట్టుకుంటాయి.

7.లడఖ్, ఎత్తైన పర్వతాలు

లడఖ్ పర్వత ప్రాంతం సాహస యాత్రలను ఇష్టపడేవారికి ఎంతో ప్రత్యేకం. ఎత్తైన పర్వతాలు, విశాలమైన లోయలు, ప్రత్యేకమైన భౌగోళిక దృశ్యాలు ప్రయాణాన్ని మరచిపోలేని అనుభూతిగా మారుస్తాయి.

10.జైసల్మేర్, గోల్డెన్ సిటీ  

రాజస్థాన్‌ లోని జైసల్మేర్ ఎడారి ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. పసుపు రంగు ఇసుకరాయితో నిర్మించిన కోటలు, భవనాలపై సూర్యకాంతి పడినప్పుడు నగరం బంగారు రంగులో మెరిసిపోతుంది. ఎడారి సఫారీ, స్థానిక సంస్కృతి కూడా ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి.

Read Also: 1964లో మూసేసిన రైల్వే లైన్.. ఇప్పుడు ఏటా 60 వేల మంది సందర్శించే టూరిస్ట్ స్పాట్.. అలా ఎలా?

Tags

Related News

తాళాల స్థానంలో స్మార్ట్ కార్డ్స్.. హోటళ్లలో ఈ మార్పు ఎందుకు? దీని వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి?

వందే భారత్ కార్గో రైలు వచ్చేస్తోంది, స్పీడ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ప్రతి భారతీయుడూ.. తప్పక చూడాల్సిన 10 సరిహద్దు ప్రాంతాలు!

1964లో మూసేసిన రైల్వే లైన్.. ఇప్పుడు ఏటా 60 వేల మంది సందర్శించే టూరిస్ట్ స్పాట్.. అలా ఎలా?

మన దేశంలో.. మనకే అనుమతి లేని రాష్ట్రాలు.. వెళ్లాలంటే దరఖాస్తు తప్పనిసరి!

టికెట్ బుకింగ్ To లైవ్ ట్రాకింగ్.. ప్రయాణికులను ఆకట్టుకుంటున్న రైల్‌ వన్ యాప్‌!

ఇక మరింత సౌకర్యవంతంగా లోకల్ రైళ్లు.. వందే మెట్రో రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×