E-Paper
Advertisement

రెండు రైళ్లు ఫుల్.. ప్రయాణికుల డిమాండ్‌తో మూడో వందే భారత్‌కు రంగం సిద్ధం!

రెండు రైళ్లు ఫుల్.. ప్రయాణికుల డిమాండ్‌తో మూడో వందే భారత్‌కు రంగం సిద్ధం!
Advertisement

Jammu Srinagar Vande Bharat: జమ్మూ-శ్రీనగర్ మధ్య ప్రయాణించే వారికి భారతీయ రైల్వే మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఈ మార్గంలో రెండు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మూడో వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ ను ప్రవేశపెట్టేందుకు రైల్వే సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉధంపూర్ ప్రజలకు ఈ కొత్త రైలు సర్వీసు మరింత ఉపయోగపడనుంది.

ఉధంపూర్‌కు కొత్త స్టాప్!

జమ్మూ-శ్రీనగర్ మధ్య ప్రతిపాదించిన మూడో వందే భారత్ రైలుకు ఉధంపూర్‌ లో స్టాప్ ఇవ్వాలని రైల్వేశాఖ నిర్ణయించింది. స్థానిక ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఉధంపూర్ ప్రజలకు  ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటివరకు జమ్మూ, శ్రీనగర్ మధ్య ప్రయాణించాలంటే అందుబాటులో ఉన్న రైళ్ల సమయాలను బట్టి ప్రయాణికులు తమ రాకపోకలను కొనసాగించాల్సి వచ్చేది. కొత్త సర్వీస్ అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత సులభతరం కానుంది.

ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు

Advertisement

జమ్మూ-శ్రీనగర్ రైలు కనెక్టివిటీలో వందే భారత్ కీలక మార్పు తీసుకొచ్చింది. 2025 జూన్ 6న రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. మొదట ఈ రైళ్లు శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నుంచి శ్రీనగర్ వరకు నడిచేవి. తర్వాత 2026 ఏప్రిల్ 30 నుంచి ఈ సేవలను జమ్మూ తవాయి రైల్వే స్టేషన్ వరకు పొడిగించారు. దీంతో జమ్మూ తవాయి నుంచి శ్రీనగర్‌కు నేరుగా వందే భారత్ ప్రయాణించే అవకాశం ప్రయాణికులకు వచ్చింది.

పెరిగిన ప్రయాణికుల డిమాండ్

ఈ రెండు రైళ్లు ప్రారంభమైనప్పటి నుంచి మంచి స్పందన లభిస్తోంది. రైళ్లు పూర్తి సామర్థ్యంతో నడుస్తుండటంతో ప్రయాణికుల డిమాండ్‌ కు అనుగుణంగా కోచ్‌ల సంఖ్యను పెంచారు. మొదట ఒక్కో రైలులో 16 కోచ్‌లు ఉండగా.. ఆ సంఖ్యను 20కి పెంచారు. అయినప్పటికీ ఈ మార్గంలో మరింత డిమాండ్ ఏర్పడ్డంతో మూడో వందే భారత్‌ను తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

269 కిలోమీటర్ల ప్రయాణం

Advertisement

ప్రస్తుతం జమ్మూ తవాయి-శ్రీనగర్ వందే భారత్ రైలు మొత్తం 269 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 4 గంటల 45 నిమిషాల్లో పూర్తి అవుతుంది. ఈ మార్గంలో ఉధంపూర్, శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, రియాసి, బనిహాల్ లాంటి కీలకమైన  స్టేషన్లలో స్టాప్‌లు ఉన్నాయి.  ఈ రైలు వల్ల జమ్మూ నుంచి కశ్మీర్ లోయకు వెళ్లే ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం లభిస్తోంది. ముఖ్యంగా పర్యాటకులు, ఉద్యోగులు, విద్యార్థులు, స్థానిక ప్రయాణికులకు ఈ రైలు ఉపయోగపడనుంది.

Read Also: IRCTC మొదలైంది అప్పుడే.. ఆ రోజు ఎన్ని టికెట్లు ఆన్‌లైన్లో బుక్ అయ్యాయో తెలుసా?

Tags

Related News

Viral Video: రైలెక్కిన ఆటో.. ఎలా వస్తాయి రా బాబూ ఇలాంటి ఐడియాలు!

మన దేశంలోని ‘బుల్లి ఇరాన్’.. పర్షియన్ భాష, సంస్కృతులు.. ఈ ఊరి కథే వేరు!

డీజిల్‌కు గుడ్‌బై.. భారత్‌లో 35 హైడ్రోజన్ రైళ్లు.. వామ్మో.. రైల్వే ప్లాన్ మామూలుగా లేదుగా!

రాయగడ–గుంటూరు ఎక్స్‌ ప్రెస్ టైమింగ్స్ ఛేంజ్.. ఆగస్టు 24 నుంచి కొత్త వేళలు ఇవే!

విమానం కూలినప్పుడు టెన్షన్ దూరం చెయ్యడానికా ఆక్సిజన్ మాస్క్.. మనం మోసపోయామా?

ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర.. రోడ్ మధ్యలో డ్రైవర్ గాఢనిద్ర.. ఎంతకీ లేకవకపోవడంతో..

సముద్ర గర్భంలో బోయింగ్ విమానాలు.. కూలిపోలేదు, కావాలనే ముంచేశారు.. ఎందుకంటే?

Big Stories

Advertisement
×