Picnic in the Sky: విమానంలో ప్రయాణం అంటే సాధారణంగా నిశ్శబ్దంగా సీట్లో కూర్చొని గమ్యస్థానానికి చేరుకుంటారు. కానీ, కొందరికి ప్రయాణం అంటే కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడం. తాజాగా ఇండిగో విమానంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు కారణం అయ్యింది. ఒక ఇండియన్ ఫ్యామిలీ ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్ని విమానంలో అందరూ కలిసి తిన్న వీడియో వైరల్ గా మారింది. కుటుంబ సభ్యులు డిస్పోజబుల్ ప్లేట్లు తీసుకుని, ఇంటి నుంచి తెచ్చుకున్న పరాటాలు, కూరలు, స్నాక్స్ వడ్డించుకుని తింటూ కనిపించారు. ఈ వీడియోను చూసి కొందరు సమర్థించగా, మరికొందరు రూల్స్ కు విరుద్ధం అంటున్నారు.
వీడియోలో ఒక మహిళ మొదట కుటుంబ సభ్యులకు డిస్పోజబుల్ ప్లేట్లు అందిస్తుంది. ఆ తర్వాత ఇంటి నుంచి తీసుకొచ్చిన ఆహారాన్ని అందరికీ వడ్డిస్తారు. కుటుంబ సభ్యులు ఒకరికొకరు భోజనం అందించుకుంటూ కలిసి తింటారు. విమానం క్యాబిన్ లోనే చిన్న ఫ్యామిలీ పార్టీ జరిగినట్లు అర్థం అవుతోంది. అందరూ కలిసి భోజనం చేయడం, మాట్లాడుకోవడం సందడిగా మారింది.
చాలా మంది నెటిజన్లు ఆ కుటుంబానికి సపోర్టుగా నిలుస్తున్నారు. భారతీయ కుటుంబాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఇంటి నుంచి ఆహారం తీసుకెళ్లడం కామన్ అంటున్నారు. రైలు, బస్సు, కారులో ప్రయాణించినా చాలా మంది ఇంటి వంటకాలను ప్యాక్ చేసుకుని తీసుకెళ్తారని చెప్తున్నారు. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, క్యాబిన్లో గందరగోళం సృష్టించకుండా ఉంటే ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. విమానయాన సంస్థ, సిబ్బందికి అభ్యంతరం లేకపోతే ప్రయాణికులు ఇంటి ఆహారం తినడంలో సమస్య ఉండకూడదని మరికొందరు అభిప్రాయపడ్డారు.
మరికొంత మంది.. విమానంలో ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం అంటున్నారు. విమానంలో ఫుడ్ అలా తింటే, నిజంగా చాలా మందికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందంటున్నారు. అందుకే, విమాన ప్రయాణంలో ప్రయాణికులు కొంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇండిగో విమానంలో ఇలాంటి విషయాలపై ఇప్పటికే ఏమైనా నిబంధనలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. విమాన సిబ్బంది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయకపోతే ఇతరులు కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
దేశంలో విమాన ప్రయాణం గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తోంది. దీంతో రైలు, బస్సు ప్రయాణాల్లో ఉండే కొన్ని అలవాట్లు విమాన ప్రయాణంలో కూడా కనిపిస్తున్నాయి. అయితే, ఆధునిక ప్రయాణంలో ఇతరుల సౌకర్యాన్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ వైరల్ వీడియో మరోసారి గుర్తు చేసింది.
India lacks civics sense 😭
A North Indian family opened a cafeteria on a running flight. Fifteen people sat together, got their own food, and walked around the cabin carrying plates.
The problem isn't just the food, its smell will linger for the entire journey, and some… pic.twitter.com/Wl9scwON1O
— Chota Don (@choga_don) August 26, 2026
Read Also: ప్రకృతి అందాల నడుమ వందేభారత్ ప్రయాణం.. ఈ 6 రూట్స్ అస్సలు మిస్ అవ్వకండి!