E-Paper
Advertisement

Bullet Train: హైదరాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్‌లో కీలక ముందడుగు.. ఆ పనులు మొదలయ్యాయ్!

Bullet Train: హైదరాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్‌లో కీలక ముందడుగు.. ఆ పనులు మొదలయ్యాయ్!
Advertisement

Hyderabad-Chennai Bullet Train: 

దేశంలో ఇప్పటికే ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2030 వరకు ఈ మార్గంలో బుల్లెట్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ టార్గెట్ కు అనుగుణంగా శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా బుల్లెట్ రైలు నెట్‌ వర్క్‌ ను విస్తరించే ప్రణాళికలను రైల్వేశాఖ వేగవంతం చేసింది. అందులో భాగంగానూ హైస్పీడ్ రైలు కనెక్టివిటీ కోసం సౌత్ ఇండియాలో తొలి బుల్లెట్ రైలు కారిడార్ కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనానికి శ్రీకారం చుట్టింది.

హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు కారిడార్

దక్షిణ భారతంలో తొలి బుల్లెట్ రైలును హైదరాబాద్- చెన్నై మార్గంలో తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ ప్లాన్ చేస్తోంది. నవరత్న PSU అయిన RITES ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు కారిడార్ కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని కొనసాగిస్తోంది. RITES ద్వారా సాధ్యాసాధ్యాల అధ్యయనం,  ట్రాఫిక్ విశ్లేషణ, డిమాండ్ అంచనాలు, అలైన్‌ మెంట్ సర్వేలు సహా పలు అంశాలను నిర్ణయించనుంది. ఆ తర్వాత హైదరాబాద్-చెన్నై హై-స్పీడ్ రైలు కారిడార్ కోసం డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(DPR)ను సిద్ధం చేయనుంది.

2 గంటలకు తగ్గనున్న హైదరాబాద్-చెన్నై ప్రయాణ సమయం

Advertisement

హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు కారిడార్ అందుబాటులోకి వస్తే, వేగం, సౌకర్యం, కనెక్టివిటీలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. రెండు నగరాల మధ్య సమయాన్ని 12 గంటల నుంచి కేవలం 2 గంటల 20 నిమిషాలకు (140 నిమిషాలు) తగ్గనుంది.

సౌత్ ఇండియాలో బుల్లెట్ రైలు మార్గం

ఈ ఏడాది ఆగస్టులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సౌత్ ఇండియాలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం సర్వేకు ఆదేశించినట్లు ప్రకటించారు. ప్రతిపాదిత బుల్లెట్ రైలు నెట్‌ వర్క్ సౌత్ ఇండియాలోని నాలుగు నగరాలను కలుపుతుందన్నారు. హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరు మధ్య ప్రయాణా సమయాన్ని మరింత తగ్గిస్తుందన్నారు. “అతి త్వరలో సౌత్ ఇండియాకు బుల్లెట్ రైలు రాబోతోంది. ఇప్పటికే రైల్వేశాఖ సర్వేకు ఆదేశించింది. హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరు, నాలుగు నగరాలను ఈ ప్రాజెక్టు కలపనుంది. 5 కోట్లకు పైగా జనాభా, ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఏపీకి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడనుంది” అన్నారు. తాజాగా విశాఖపట్నంలో జరిగిన ‘ఇండియా ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ సమ్మిట్’లో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇండియాలో బుల్లెట్ రైలు మార్గాలు

Advertisement

గతంలో రైల్వేశాఖ దేశంలోని స్పీడ్ రైలు నెట్‌ వర్క్ అభివృద్ధి కోసం ఈ క్రింది మార్గాలను ప్రస్తావించింది:

⦿ ఢిల్లీ – వారణాసి

⦿ ఢిల్లీ – అహ్మదాబాద్

⦿ ముంబై – నాగ్‌పూర్

⦿ ముంబై – హైదరాబాద్

⦿ చెన్నై – మైసూర్

⦿ ఢిల్లీ – అమృత్‌సర్

⦿ వారణాసి – హౌరా

వీటికి తోడుగా ఇప్పుడు హైదరాబాద్-చెన్నై మార్గం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కొనసాగుతోంది. ఈ మార్గం హైదరాబాద్, చెన్నై మార్గంలో రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులకు ఎంతగానో ఉపయోగపడనుంది.

Read Also: హైదరాబాద్ నుంచి వెళ్లే ఈ వందేభారత్ రైళ్లలో కీలక మార్పులు.. ఈ రోజుల్లో ఉండవట!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×