BigTV English

Tatkal Bookings: వామ్మో తత్కాలా? బెదిరిపోతున్న రైల్వే ప్రయాణీకులు!

Tatkal Bookings: వామ్మో తత్కాలా? బెదిరిపోతున్న రైల్వే ప్రయాణీకులు!

Tatkal Bookings survey:  అత్యవసర ప్రయాణాలు చేసే ప్యాసింజర్ల కోసం భారతీయ రైల్వే తత్కాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణానికి ఒక్కరోజు ముందు ఈ టికెట్లు బుకింగ్ కు అవకాశం కల్పిస్తోంది. అయితే, తక్కువ టికెట్లు, ఎక్కువ పోటీ నేపథ్యంలో క్షణాల్లోనే అయిపోతాయి. చాలా మంది తత్కాల్ టికెట్ బుకింగ్ ఓ పెద్ద స్కామ్ అంటూ కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా తత్కాల్ బుకింగ్ మీద సిటిజన్ ఎంగేజ్‌ మెంట్ ప్లాట్‌ ఫామ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి అయ్యాయి. తత్కాల్ టికెట్ బుకింగ్ కు ప్రయత్నించిన 10 మందిలో కేవలం నలుగురు మాత్రమే పాజిటివ్ గా స్పందించారు.


తత్కాల్ టికెట్ బుకింగ్ పై ప్రయాణీకుల అసంతృప్తి

తత్కాల్ బుకింగ్ టికెట్లు అత్యవసర ప్రయాణానికి అనుకూలంగా ఉన్నప్పటికీ, వీటిని బుక్ చేసుకోవడం అంత ఈజీ కాదు. 100 మందిలో 70 మంది ఈ విధానం బాగా లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. గత 12 నెలల్లో 10 మందిలో ఏడుగురు ఈ పథకం కింద ఆన్‌లైన్ టికెట్లను బుక్ చేసుకోవడం కష్టమని వెల్లడించారు. బుకింగ్ విండో తెరిచిన నిమిషంలోనే అన్ని టికెట్లు అయిపోతున్నాయన్నారు. ఫలితంగా మిగతా ప్రయాణీకుల టికెట్లు వెయిట్ లిస్టులోకి వెళ్తున్నాయంటున్నారు.  అంతేకాదు, తత్కాల్ టికెట్ బుకింగ్ లో తాము చాలా సార్లు విఫలం అయినట్లు వెల్లడించారు.


తత్కాల్ బుకింగ్ కు ట్రావెల్ ఏజెంట్స్ బెస్ట్!

తాజా సర్వే ప్రకారం తత్కాల్ టికెట్ పొండదానికి ఉత్తమ మార్గం ట్రావెల్ ఏజెంట్స్ అని మరికొంత మంది ప్రయాణీకులు అభిప్రాయపడ్డారు. 10 మంది ప్రయాణీకులలో ముగ్గురు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “ ప్రస్తుత డిజిటల్ యుగంలో తత్కాల్ బుకింగ్ పొందడానికి ప్రయాణీకులు ట్రావెల్ ఏజెంట్స్ ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. సాధారణ ప్రయాణీకులతో పోల్చితే వాళ్లే ఈజీగా తత్కాల్ టికెట్లను బుక్ చేస్తున్నారు. తత్కాల్ బుకింగ్ వ్యవస్థ మీద చాలా అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత రైల్వే మీద ఉంది” అని సర్వే సంస్థ అభిప్రాయపడింది.

55 వేల శాంపిల్స్ తో సర్వే

తత్కాల్ టికెట్లను బుక్ చేసుకునే వ్యక్తుల అనుభవాలను తెలుసుకోవడానికి ఈ దేశవ్యాప్తంగా సర్వేను నిర్వహించినట్లు లోకల్ సర్కిల్స్ వెల్లడించింది. దేశంలోని 396కి పైగా జిల్లాల్లో ఉన్న రైల్వే ప్రయాణీకుల నుంచి సుమారు 55,000 కంటే ఎక్కువ శాంపిల్స్ తీస్తున్నట్లు తెలిపింది.  వీరిలో 63 శాతం మంది పురుషులు కాగా, 37 శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలిపింది. సర్వే నివేదిక ప్రకారం, 41 శాతం మంది  టైర్-1 నగరాల నుంచి ఉండగా, 29 శాతం మంది టైర్-2 నుంచి ఉన్నారు. 30 శాతం మంది టైర్-3, టైర్ 4, 5 నగరాలు, గ్రామీణ జిల్లాల నుంచి కూడా కొంత మంది నుంచి శాంపిల్స్ తీసుకున్నట్లు సర్వే సంస్థ వెల్లడించింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని టికెట్లు బుక్ చేసినా, క్షణాల్లో అన్నీ అయిపోతున్నాయనే అసంతృప్తి ప్రయాణీకుల నుంచి వ్యక్తం అయ్యింది.

Read Also:  బడ్జెట్ ఫ్రెండ్లీ ఫారిన్ వెకేషన్, అదీ వీసా అక్కర్లేకుండానే!

Related News

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Big Stories

×