Karnataka Tour IRCTC Package| కర్ణాటకలోని ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల సందర్శన కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కొత్తగా “డివైన్ కర్ణాటక” పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణం ద్వారా కర్ణాటకలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను, అందమైన పర్యాటక ప్రదేశాలను చూడవచ్చు. మొత్తం 5 రాత్రులు, 6 రోజులు (పగలు) సాగే ఈ టూర్లో గోకర్ణ, మురుడేశ్వర్, ఉడిపి, ధర్మస్థల, శృంగేరి, కుక్కే సుబ్రమణ్య వంటి ప్రసిద్ధ దైవ ప్రాంతాలను సందర్శించే అవకాశాన్ని ఐఆర్సిటిసి కల్పిస్తోంది.
మొదటి రోజు:
ఉదయం 6:00 గంటలకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇండిగో ఫ్లైట్ (6E 7549) లో బయలుదేరి 8:00 గంటలకు (రెండు గంటలు ప్రయాణం) మంగుళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు.
ఎయిర్పోర్ట్లో అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని హోటల్కు వెళ్లి చెకిన్ చేశాక బ్రేక్ఫాస్ట్ అందుబాటులో ఉంటుంది.
ఆ తర్వాత మంగళదేవి ఆలయం, కద్రి మంజునాథ దేవాలయాన్ని సందర్శనకు వెళ్లాలి.
సాయంత్రం తన్నెరభావి బీచ్, కుద్రోలి శ్రీ గోకర్ణనాథ క్షేత్రాన్ని దర్శించుకోవాలి.
రాత్రి డిన్నర్ అనంతరం మంగుళూరు హోటల్ లోనే బస చేయాలి.
రెండో రోజు:
ఉదయం టిఫిన్ అనంతరం ఉడిపికి బయలుదేరాలి.
ఉడిపిలోని హోటల్ చెకిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం సెయింట్ మేరీ ఐలాండ్, మల్పే బీచ్ సందర్శనకు బయలు దేరాలి.
సాయంత్రం ఉడిపి శ్రీకృష్ణ ఆలయం దర్శించుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
Also Read: ఇక రైల్వే టికెట్ల బుకింగ్ మరింత ఈజీ.. కొత్త సిస్టం ప్రవేశ పెట్టిన భారతీయ రైల్వే
ఉదయం బ్రేక్ఫాస్ట్ అనంతరం హోరనాడుకు ప్రయాణం.
అక్కడ అన్నపూర్ణేశ్వరి దేవాలయాన్ని దర్శించుకుని శృంగేరికి వెళ్లాలి.
శృంగేరి శారదాంబ ఆలయ సందర్శన అనంతరం తిరిగి ఉడిపికి చేరుకుని అక్కడే రాత్రికి బస.
నాలుగో రోజు:
ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత గోకర్ణ బయలుదేరుతారు
గోకర్ణలోని ప్రసిద్ధ దేవాలయాలను, బీచ్ సందర్శించి మురుడేశ్వర్కు ప్రయాణిస్తారు
మురుడేశ్వర్ ఆలయం సందర్శన అనంతరం తిరిగి ఉడిపికి చేరుకుని అక్కడ బస చేస్తారు
ఐదో రోజు:
బ్రేక్ఫాస్ట్ అనంతరం ధర్మస్థల వెళ్లి మంజునాథ స్వామి ఆలయాన్ని దర్శిస్తారు
తర్వాత కుక్కే సుబ్రమణ్య వెళ్లి అక్కడ హోటల్లో చెకిన్ అవుతారు
ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు
ఆరో రోజు:
ఉదయం బ్రేక్ఫాస్ట్ తరువాత కుక్కే సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకుని మంగుళూరు చేరుకుంటారు
మధ్యాహ్నం ఎయిర్పోర్ట్కు చేరుకుని సాయంత్రం 4:20 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది
రాత్రి 7:00 గంటలకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుని టూర్ ముగుస్తుంది
టూర్ ధర వివరాలు:
సింగిల్ ఆక్యుపెన్సీ – ₹43,550
డబుల్ ఆక్యుపెన్సీ – ₹34,850
ట్రిపుల్ ఆక్యుపెన్సీ – ₹33,500
5-11 సంవత్సరాల పిల్లల కోసం:
విత్ బెడ్: ₹29,400
విత్ అవుట్ బెడ్: ₹26,900
2-4 సంవత్సరాల పిల్లల కోసం:
విత్ అవుట్ బెడ్: ₹20,650
టూర్ ప్యాకేజీలో ఉండే సౌకర్యాలు:
టూర్ బుకింగ్ & తేదీలు:
ప్రస్తుతానికి ఈ ప్యాకేజీ మార్చి 3, 2025 నుంచి అందుబాటులో ఉంటుంది.
టూర్ బుకింగ్ & ఇతర పూర్తి వివరాలకు లింక్ పై క్లిక్ (డివైన్ కర్ణాటక) చేయండి