BigTV English

Indian Railways: రైలు వెళ్తుంటే సరదాగా కూడా ఆ పని చెయ్యకండి, కుర్రాళ్లూ మీకే ఈ హెచ్చరిక!

Indian Railways: రైలు వెళ్తుంటే సరదాగా కూడా ఆ పని చెయ్యకండి, కుర్రాళ్లూ మీకే ఈ హెచ్చరిక!
Advertisement

Stone-pelting at Train: దేశంలో రైల్వే చట్టాలను కఠినంగా అమలు చేయబోతున్నట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత పలువురు ఆకతాయిలు వాటిపై రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. ఇలాంటి పనుల వల్ల రైల్వేకు గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లుతోందని అధికారులు గుర్తించారు. అదే సమయంలో ప్రయాణీకులు గాయాలపాలు కావడంతో పాటు భయాందోళనకు గురవుతున్నట్లు గుర్తించారు. అయితే, ఈ పనులు చట్టపరమైన పరిణామాల పట్ల అవగాహన లేకపోవడంతో పాటు కొంతమంది స్థానికులు వినోదం కోసం చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.


తెలంగాణలోనూ ఇలాంటి ఘటనలు

తెలంగాణలోనూ వందేభారత్ రైళ్లపై రాళ్లు విసిరిన ఘటనలు జరిగాయి. ఫలక్‌నుమా నుంచి బుద్వేల్, సీతాఫల్‌ మండి నుంచి లాల్లగూడ, హఫీజ్‌పేట నుంచి లింగంపల్లి, మహబూబ్‌నగర్ నుంచి మల్కాజ్‌గిరి స్టేషన్లకు వెళ్లే మార్గాల్లో ఇలాంటి ఘటనలు జరిగినట్లు రైల్వే అదికారులు గుర్తించారు. అంతేకాదు, ఈ మార్గాల్లో రాళ్లు రువ్వే కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగించడం, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం, పట్టాలపై ప్రమాదకర వస్తువులను ఉంచడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అయితే, ఇలాంటి పనులకు ప్రజలు దూరంగా ఉండాలని రైల్వే పోలీసులు పిలుపునిచ్చారు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే, 139కి కాల్ చేయాలని సూచించారు.


ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న రైల్వే అధికారులు

రాళ్లు రువ్వడం లాంటి చర్యలు పాల్పడకుండా విద్యార్థులకు, రైల్వే లైన్ల దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలకు రైల్వే పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభావిత సెక్షన్లతో పాటు  బ్లాక్ స్పాట్లలో సామాజిక వ్యతిరేక వ్యక్తులు, తాగుబోతులపై రైల్వే చట్టం ప్రకారం రెగ్యులర్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. పట్టాలకు దగ్గరగా ఉన్న మైదానాల్లో పిల్లలు ఆడుకునే గ్రామాల సర్పంచ్ లు, సమీపంలోని హాస్టళ్ల ప్రిన్సిపాల్‌లు, ఇంటి యజమానులకు నోటీసులు అందజేయాలని భద్రతా సిబ్బందిని రైల్వే అధికారులు ఆదేశించారు. తరచుగా ఇలాంటి సంఘటనలు జరిగే బ్లాక్ స్పాట్‌లను గుర్తించి, తగిన చర్యలు చేపట్టాలన్నారు.  బ్లాక్ స్పాట్లల దగ్గర నిఘా ఉంచడానికి సిబ్బందిని నియమించాలని సూచించింది. అంతేకాకుండా, ట్రాక్‌సైడ్ నివాస ప్రాంతాలలోని తల్లిదండ్రులలో రాళ్లు రువ్వడం వల్ల కలిగే పరిణామాల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also: కూతురిపై తండ్రి అఘాయిత్యం.. రైల్లో ప్రసవం.. టాయిలెట్ లో బిడ్డ!

రాళ్లు రువ్వితే 5 ఏళ్ల జైలు శిక్ష

రైల్వే చట్టం (సెక్షన్ 153 & 154)లోని సంబంధిత సెక్షన్లు ప్రకారం రైళ్లపై రాళ్లు రువ్వితే కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు వెల్లడించారు. రాళ్లు రువ్వడం, ట్రాక్ లపై ప్రమాదకర వస్తువులు ఉంచిన వ్యక్తులకు సెక్షన్ 153 ప్రకారం 5 సంవత్సరాల వరకు శిక్ష, సెక్షన్ 154 ప్రకారం 1 సంవత్సరం వరకు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయన్నారు.

Read Also: రైల్లో నీలం, నల్ల బ్యాగులు కనిపిస్తే చాలు మాయం చేస్తారు.. ఎందుకంటే?

Related News

Watch Video: రైల్వే ట్రాక్ మీద రీల్స్.. దూసుకొచ్చిన రైలు, గాల్లోకి ఎగిరిపడ్డ యువకుడు!

Viral Video: వద్దని చెప్పినా వినకుండా.. 9 నెలల పాపతో మంచు పర్వతమెక్కిన జంట, చివరికి..

Zip-lining In Hyderabad: హైదరాబాద్ లో అడ్వెంచర్ స్పాట్.. జిప్ లైనింగ్, స్కై సైక్లింగ్ ఎంజాయ్ చేయండి!

Fuel Leaks in Flight: విమానం గాల్లో ఉండగా ఫ్యూయెల్ లీక్..భయంతో వణికిపోయిన ప్రయాణీకులు!

Ajanta Express: మెదక్ లో అకస్మాత్తుగా ఆగిపోయిన అజంతా ఎక్స్‌ ప్రెస్, గంటల తరబడి ప్రయాణీకుల అవస్థలు!

Mummy in Hyderabad: 2500 ఏళ్ల నాటి ఈజిప్ట్ మమ్మీ.. హైదరాబాద్‌లోనే ఉంది తెలుసా?

Special Trains: పండుగ వేళ 973 ప్రత్యేక రైళ్లు, ప్రయాణీకులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్!

3800 Years Old Temple: రాళ్ల మధ్యలో 3800 ఏళ్ల అద్భుత ఆలయం, అదీ హైదరాబాద్ లోనే!

Big Stories

×