E-Paper
Advertisement

హైదరాబాద్‌కు గుడ్ న్యూస్.. మరో రైల్వే టెర్మినల్‌ వచ్చేస్తోంది!

హైదరాబాద్‌కు గుడ్ న్యూస్.. మరో రైల్వే టెర్మినల్‌ వచ్చేస్తోంది!
Advertisement

Malkajgiri Mini Railway Terminal Plan: హైదరాబాద్ రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పబోతోంది. మల్కాజ్‌ గిరి రైల్వే జంక్షన్‌ ను మినీ టెర్మినల్‌ గా అభివృద్ధి చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, మల్కాజ్‌గిరి భవిష్యత్తులో హైదరాబాద్‌కు రెండో ముఖ్యమైన రైల్వే టెర్మినల్‌గా మారే అవకాశం ఉంది.

పెరుగుతున్న ప్రయాణికులు రద్దీ

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ప్రధాన రైల్వే టెర్మినళ్లపై రైళ్ల రద్దీ, ప్రయాణికుల ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా కాచిగూడ స్టేషన్‌పై ఉన్న ఆపరేషనల్ భారాన్ని కొంతవరకు తగ్గించేందుకు మల్కాజ్‌గిరిని ఉపయోగించుకోవచ్చనే ఆలోచన ఉంది. ఇందుకోసం స్టేషన్‌లో అదనపు ట్రాక్‌లు, లూప్ లైన్లు, ప్లాట్‌ఫారాలు, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. మల్కాజ్‌గిరిని మినీ టెర్మినల్‌గా మార్చితే హైదరాబాద్ నుంచి బయలుదేరే, నగరంలోనే ప్రయాణం ముగించే కొన్ని రైళ్లను ఇక్కడి నుంచి నడిపే అవకాశం ఉంటుంది. దీనివల్ల రైళ్ల రాకపోకలను వేర్వేరు స్టేషన్లకు విభజించవచ్చు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో రైల్వే నిర్వహణ సులభమయ్యే అవకాశం ఉంది.

పరిసర ప్రయాణికులకు మరింత ఉపయోగకరం

Advertisement

మల్కాజ్‌గిరి పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రయాణికులకు కూడా ఈ ప్రతిపాదన ఉపయోగకరంగా మారొచ్చు. ప్రస్తుతం దూరంలోని ప్రధాన స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం ఉన్న కొందరు ప్రయాణికులకు మల్కాజ్‌గిరి నుంచే మరిన్ని రైలు సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గుతుంది. కర్నూలు, నిజామాబాద్ లాంటి ప్రాంతాలకు నేరుగా, మెరుగైన కనెక్టివిటీ కల్పించాలని ప్రయాణికులు చాలాకాలంగా కోరుతున్నారు.

ఇక సబర్బన్ రైలు సేవల విషయంలోనూ ఈ అభివృద్ధి కీలకంగా మారే అవకాశం ఉంది. మల్కాజ్‌గిరి చుట్టుపక్కల ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది. అదనపు ట్రాక్‌లు, ప్లాట్‌ ఫారాలు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో మరిన్ని MMTS సేవలను వివిధ మార్గాల్లో నడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది.

గతంలోనూ రెండో టెర్మినల్ ప్రతిపాదన

Advertisement

మల్కాజ్‌గిరిని రెండో టెర్మినల్‌గా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఇప్పుడే మొదటిసారి రావడం కాదు. కొన్ని సంవత్సరాల క్రితమే ఇలాంటి ప్రతిపాదన వచ్చింది. ఆ తర్వాత కొన్ని పరిపాలనా కారణాలతో దృష్టి చర్లపల్లి వైపు మళ్లింది. అక్కడ టెర్మినల్ అభివృద్ధి పనులు కూడా చేపట్టారు. అయినప్పటికీ మల్కాజ్‌గిరి ప్రయాణికుల డిమాండ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. అదనపు ప్లాట్‌ఫారాలు, మరిన్ని రైల్వే ట్రాక్‌లు, మెరుగైన ప్రయాణికుల సౌకర్యాలు కల్పించాలని స్థానిక ప్రయాణికుల సంఘాలు చాలాకాలంగా కోరుతున్నాయి. తాజాగా రైల్వే అధికారులు మల్కాజ్‌గిరి స్టేషన్‌ను పరిశీలించడం, ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు ఈ ప్రతిపాదనకు మరోసారి ప్రాధాన్యం తీసుకొచ్చాయి. ప్రణాళిక కార్యరూపం దాల్చితే మల్కాజ్‌గిరి భవిష్యత్తులో హైదరాబాద్ రైల్వే నెట్‌ వర్క్‌ లో మరింత కీలకమైన స్టేషన్‌గా మారే అవకాశం ఉంది.

Read Also: 24 గంటల ప్రయాణం ఇక 16 గంటలే.. కొత్త వందేభారత్ స్లీపర్ వచ్చేస్తోంది!

Tags

Related News

మెట్రో రైళ్లలో రద్దీకి చెక్.. కొత్త కోచ్‌లు వచ్చేస్తున్నాయ్!

టాయిలెట్ ఫ్లష్ చెయ్యొద్దు.. రాత్రపూట నవ్వొద్దు.. ఇవేం వింత చట్టాలు రా అయ్యా!

యుఏఈ ఫ్రీ వీసా.. భారతీయులకు స్పెషల్ ఆఫర్ ప్రకటించిన యుఏఈ.. కండీషన్స్ ఇవే

నీటి తెర వెనుక దాగిన అద్భుతం.. హైదరాబాద్ సమీపంలో క్రేజీ వీకెండ్ డెస్టినేషన్!

ప్రపంచంలోనే 5 బెస్ట్ రైలు ప్రయాణాలు.. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

24 గంటల ప్రయాణం ఇక 16 గంటలే.. కొత్త వందేభారత్ స్లీపర్ వచ్చేస్తోంది!

రష్యా నుంచి భారత్‌కు డైరెక్ట్ ట్రైన్.. ప్రయాణికుల కోసం కాదా?

Big Stories

Advertisement
×