E-Paper
Advertisement

Railway platform: ప్లాట్ ఫామ్ పై నిద్ర పోతున్నారా? ఇలా జరుగుతుందేమో జాగ్రత్త!

Railway platform: ప్లాట్ ఫామ్ పై నిద్ర పోతున్నారా? ఇలా జరుగుతుందేమో జాగ్రత్త!
Advertisement

Railway platform: ఉత్తరప్రదేశ్‌లోని మథురా జంక్షన్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఘటన స్థానికులను, ప్రయాణికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. రైల్వే ప్లాట్‌ఫారమ్ నంబర్ 1పై నిద్రిస్తున్న కుటుంబం నుండి ఒక సంవత్సరపు చిన్నారి అపహరణకు గురైంది. ఈ ఘటన సుమారు రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీస్ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించడంతో పాటు, పాప కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు ప్రారంభించారు.

పోలీసుల సమాచారం ప్రకారం, జబల్‌పూర్‌కి చెందిన ఆనంద్, పూజ దంపతులు తమ ఇద్దరు చిన్నారులతో కలిసి మథురా జంక్షన్‌లో ప్లాట్‌ఫారమ్‌పై తమ రైలు కోసం వేచి చూస్తున్నారు. రాత్రి ఆలస్యమవడంతో వారు తమ సామాన్లతో పాటు అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఆ సమయంలో జరిగిన ఘటన వారి జీవితాన్ని తారుమారు చేసింది.

Advertisement

పూజా అనే తల్లి వాష్‌రూమ్‌కి వెళ్లే సమయంలో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి తన ఏడాది పాపను ఎత్తుకొని వెళ్తున్న దృశ్యం కనిపించడంతో షాక్‌కు గురయ్యింది. వెంటనే ఆమె గట్టిగా అరిచి, భర్తతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులను అలర్ట్ చేసింది. క్షణాల్లోనే ప్లాట్‌ఫారమ్ మొత్తం కలకలం రేగింది. అయినప్పటికీ, గందరగోళంలో ఆ వ్యక్తి ఆగిపోతున్న సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్లోకి ఎక్కి పరారయ్యాడు.

ప్రయాణికుల సహకారంతో రైల్వే పోలీసులు తక్షణమే ప్లాట్‌ఫారమ్ చుట్టుపక్కల ప్రాంతాలను తనిఖీ చేయగా, అపహరించబడిన పాపను లేదా నిందితుడిని అక్కడ కనుగొనలేకపోయారు. వెంటనే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఒక వ్యక్తి చిన్నారిని ఎత్తుకొని వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి.

Advertisement

గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) స్టేషన్ హౌస్ ఆఫీసర్ యద్రామ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి దుస్తులు, శరీరాకృతి ఆధారంగా మేము విచారణను వేగవంతం చేశాం. ఇప్పటికే మూడు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి శోధన చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, ప్రస్తుతం ఆ వ్యక్తి ఎటువైపు వెళ్లాడన్నదానిపై దృష్టి సారిస్తున్నాం. ట్రైన్ లోపల, ట్రాక్ పక్కన మరియు తదుపరి స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నాం. పాపను సురక్షితంగా తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఈ ఘటనతో స్టేషన్‌లోని ప్రయాణికులు, ముఖ్యంగా చిన్నపిల్లలతో ప్రయాణిస్తున్న తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. రాత్రిపూట ప్లాట్‌ఫారమ్‌లపై భద్రతా సిబ్బంది తక్కువగా ఉండటంతో, ఈ ఘటన భద్రతా లోపాలను స్పష్టంగా బయటపెట్టిందని పలువురు ప్రయాణికులు వ్యాఖ్యానిస్తున్నారు. రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచాలని, ప్రత్యేకంగా చిన్నపిల్లలు, మహిళల భద్రత కోసం సీసీటీవీ మానిటరింగ్‌ను మరింత కట్టుదిట్టం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు, పాప తల్లి పూజ, తండ్రి ఆనంద్ మానసికంగా తీవ్ర వేదనలో ఉన్నారు. నేను కాసేపు వాష్‌రూమ్‌కి వెళ్ళాను. వెనక్కి తిరిగేలోపే నా పాపను ఎత్తుకెళ్లారు. నేను గట్టిగా అరిచినా, జనసమూహంలో అతడిని అడ్డుకోలేకపోయామని పూజ కన్నీరు మున్నీరవుతూ చెప్పింది. చిన్నారి కోసం ఏదైనా సమాచారముంటే వెంటనే పోలీసులకు అందించమని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: Ganesh Puja: గణపతి పూజలో.. ఈ రంగు దుస్తులు ధరిస్తే గణపతి ఆశీర్వాదాలకు దూరమే!

పోలీసులు అనుమానితుడి వివరాలను సేకరించడానికి సమీప స్టేషన్లలోని సిబ్బందికి సమాచారం అందించారు. ఉత్తరప్రదేశ్‌లోని సమీప రైల్వే స్టేషన్లలో కూడా ఫోటోలు పంపి, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైల్వే భద్రతా దళాలు (RPF) కూడా ఈ కేసులో సహకరించడానికి ముందుకొచ్చాయి.

ఈ ఘటన మథురా నగరంలో మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. చిన్నపిల్లల కిడ్నాప్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఇలాంటి ఘటనలు భయాన్ని పెంచుతున్నాయి. స్థానికులు మాట్లాడుతూ, రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేయాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో పట్రోలింగ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి స్పెషల్ టీమ్ కూడా ఏర్పాటు చేశారు. రైల్వే భద్రతా విభాగం మరియు లోకల్ పోలీసులు కలిసి నిందితుడి కదలికలను ట్రాక్ చేస్తున్నారు. చిన్నారి సురక్షితంగా తిరిగి రావాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని త్వరగా పట్టుకొని, చిన్నారిని సురక్షితంగా తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×