BigTV English

Indian Railways Mizoram: 26 ఏళ్ల తర్వాత.. ఆ ట్రాక్ లోకి రైలు.. అసలేమైంది?

Indian Railways Mizoram: 26 ఏళ్ల తర్వాత.. ఆ ట్రాక్  లోకి రైలు.. అసలేమైంది?

Indian Railways Mizoram: ఎప్పుడో మొదలైన గాధ. మధ్యలో నిలిచిపోయిన ఆశ. కాలం తీరినప్పుడల్లా వినిపించిన వాగ్దానాలు. చివరకు నిశ్శబ్దం అయిన ఆ పట్టాలపై.. ఇప్పుడు మళ్లీ ఓ శబ్దం! అది సాదా రైలు శబ్దం కాదు… గుండె దడపడే శబ్దం! ఏం జరిగిందంటే, అందులోనే ఉంది అసలైన ట్విస్ట్!


మీ ఊరికి ఎప్పుడైతే రైలు వస్తుందో, అప్పుడే అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ పడినట్టే. అలాంటి ఘట్టమే ఇప్పుడు మిజోరాం వాసుల జీవితాల్లో చోటు చేసుకుంది. రాజధాని ఐజాల్‌కి 26 ఏళ్ల తర్వాత భారత రైల్వే కనెక్షన్ లభించడం ఒక్క రాష్ట్రానికే కాదు, దేశానికే గర్వకారణం. ఎన్నేళ్లుగా కష్టపడుతూ, ఎదురుచూసిన తరువాత ఇప్పుడు వాళ్ల ఊరికి కూడా రైలు వచ్చిందంటే ఎలా వుంటుందో ఊహించండి!

1998లో ఊహించిన కల.. ఇప్పుడు నిజమైంది!
ఈ ప్రాజెక్ట్ ఆరంభం మాత్రం మామూలుగా జరగలేదు. 1998లో మొదలైన ఈ ప్రణాళిక, పలు సాంకేతిక సమస్యలు, పొలిటికల్ పద్ధతులు, భూసేకరణ సమస్యలు ఇలా అన్నిటినీ ఎదుర్కొని ఇప్పుడు ఫలితాన్ని అందించింది. సైరాంగ్ స్టేషన్ వరకూ పొడవైన 51 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 6,500 కోట్లు ఖర్చు చేసింది. చిన్న మార్గమే అయినా ఇందులో టన్నెళ్ళు 23, భారీ వంతెనలు, సున్నితమైన లోయల మీదుగా వెళ్లే మార్గం.. అన్నీ కలిపి ఒక అద్భుతమైన ఇంజినీరింగ్ కృషి!


ఇప్పుడు ఏకంగా రైలు ఎక్కి ఐజాల్ అనొచ్చు!
ఇప్పటిదాకా మిజోరాం అంటే విమానంలో వెళ్లాల్సిందే అనేది తప్పనిసరి. కానీ ఇప్పుడు పల్లె పట్టణాల నుంచి కూడా బస్సు ఎక్కినట్టు రైలు ఎక్కి సైరాంగ్ వరకు వెళ్లొచ్చు. ఇక అక్కడినుంచి ఐజాల్ నగరానికి కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు.. అందరికీ ఇది ఊరట కలిగించే మార్గం.

అడవుల నడుమ ట్రైన్ ప్రయాణం.. అదో వింత అనుభవం
ఈ మార్గం మాత్రం చూడగానే ఫోటో తీసేసుకోవాలనిపించేలా ఉంటుంది. పొడవైన వంతెనలు, లోయల మధ్య తిరిగే రైలు, కొండలపై ట్రాక్‌లు.. వాస్తవానికి ట్రైన్‌లో కూర్చొని చూస్తుంటే ఏదో సినిమా షూటింగ్‌లో ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది. ఇది టూరిజం అభివృద్ధికీ బాగా ఉపయోగపడనుంది.

ఈశాన్యానికి ఇది బంగారు గేటు
ఈ రైల్వే ప్రాజెక్ట్ పూర్తవ్వడం ద్వారా, మిజోరాం కూడా దేశ మౌలిక వసతులలో ఒక భాగంగా మారింది. రాష్ట్రాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఇప్పుడు కేవలం ఐజాల్ వరకే కాదు, భవిష్యత్తులో మరిన్ని పట్టణాలకు ట్రైన్ కనెక్షన్లు కల్పించేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది.

Also Read: Secunderabad station upgrade works: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో.. సూపర్ ఫెసిలిటీ! హైరేంజ్ అంటే ఇదేనేమో!

కేంద్రం అభినందనలు.. ప్రజల ఆనందం!
ఈ రైల్వే లైన్ ప్రారంభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి సహా పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది వన్ ఇండియా.. యునైటెడ్ ఇండియా అనే భావనకు నిదర్శనంగా నిలుస్తోంది.
రైలు వచ్చింది.. ఇప్పుడు అభివృద్ధి పరుగులు తీస్తుంది!

మొత్తానికి ఐజాల్‌కి రైలు వచ్చింది అంటే, అక్కడి వాసుల కల నెరవేరినట్టే. ఇకపై ఆ ప్రాంత అభివృద్ధికి బ్రేకులే ఉండవు. ఒకప్పుడు తమ ఊరికి రైలు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసిన ప్రజలు ఇప్పుడు ఆ ట్రైన్ లో ఎక్కి సాఫీగా ప్రయాణిస్తున్నారంటే దేశ అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.

Related News

Tirumala TTD updates: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆన్ లైన్ టికెట్లు రద్దు.. టీటీడీ కీలక ప్రకటన ఇదే!

IRCTC Shirdi Package: విజయవాడ నుంచి షిరిడీకి రైల్వే సూపర్ ప్యాకేజ్.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!

Indian Railways incidents: ఒక్కరి కోసం రైలు ఆగింది.. నమ్మడం లేదా? అయితే ఆ చిట్టా ఇదే!

Indian Railways: రైళ్లలో వైట్ బెడ్ రోల్స్ మాత్రమే ఎందుకు వాడతారు? తెలిస్తే మైండ్ బ్లాక్ అవుద్ది!

Railway employees benefits: రైల్వే ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కోటి రూపాయలతో కొండంత అండ మీకోసమే!

Telangana railways: పాత రూపానికి గుడ్‌బై.. తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్‌ కు మోడర్న్ టచ్.. సెల్ఫీకి రెడీనా!

Big Stories

×