E-Paper
Advertisement

MMTS Trains: కొత్త రూట్లు, మరిన్ని స్టాప్ లు, MMTS ప్రయాణీకులకు క్రేజీ న్యూస్!

MMTS Trains: కొత్త రూట్లు, మరిన్ని స్టాప్ లు, MMTS ప్రయాణీకులకు క్రేజీ న్యూస్!

Indian Railways: హైదరాబాద్ లోని సబర్బన్ రైల్వే స్టేషన్లు అయిన సఫిల్‌ గూడ, రామకృష్ణ నగర్, నేరేడ్‌ మెట్‌ లను ఒకప్పుడు శివార్లు ప్రాంతాలుగా పరిగణించే వారు.  కానీ, ఇప్పుడు హైదరాబాద్‌ లోనే ఉన్నాయి. భారతీయ రైల్వే ఈ స్టేషన్లను ఆధునిక మౌలిక సదుపాయాలు, విద్యుత్ కనెక్టివిటీ తో అద్భుతంగా అప్‌ గ్రేడ్ చేశాయి. అయితే, ఇక్కడి నుంచి సరైన MMTS సేవలు లేకపోవడంతో పాటు ముఖ్యమైన రైళ్లకు హాల్టింగ్ ఇవ్వకపోవడంపై స్థానికులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిపడ MMTS రైళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు ముఖ్యమైన రైల్లు ఆగేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయబడిన మల్కాజ్‌ గిరి రైల్వే స్టేషన్‌ లో కీలకమైన రైళ్లను ఆపాలని కోరుతున్నారు.

త్వరలో జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం

వచ్చే నెలలో 76వ జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (ZRUCC) సమావేశం జరగనుంది. పలు ప్రయాణీకుల సంఘాలు, నివాస సంక్షేమ సంస్థలు ఈ సమస్యలను లేవనెత్తాలని భావిస్తున్నారు. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, 25 మంది కమిటీ సభ్యులు, జనరల్ మేనేజర్, ప్రధాన విభాగాల అధిపతులు పాల్గొననున్నారు. “జనాభా పది రెట్లు పెరిగినందున ఈ స్టేషన్లకు సరైన అప్రోచ్ రోడ్లు అవసరం. ప్రధాన రైళ్లు ఈ స్టేషన్లలో ఆగాలి. ప్రస్తుతం స్థానికులు రైళ్లలో ప్రయాణించడానికి చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. రైల్వేలు ఈ అవసరాలను గుర్తించి అవసరమైన మార్పులను అమలు చేయాలి” అని కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సెక్రటరీ జనరల్ శ్రీనివాసన్ కోరారు.

MMTS రైళ్ల టైమింగ్స్ లో మార్పులు చేపట్టాలి

తాజాగా రైలు ప్రయాణికుల సంఘం, కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సమావేశమై ఈ సమస్యల గురించి చర్చించారు. జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు.  ఆఫీస్ లకు వెళ్లే ఉద్యోగులకు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా MMTS రైలు సమయాలను మార్చేలా రైల్వే అధికారులను కోరాలని నిర్ణయించారు. “కాచిగూడ నుంచి వందే భారత్, ఇతర రైళ్లతో కనెక్ట్ చేసేలా  ఉదయం 5.30 గంటలకు మేడ్చల్ నుంచి కాచిగూడకు కొత్త MMTS రైలును అందుబాటులోకి తీసుకురావాలి. అలాగే, తుంగభద్ర ఎక్స్‌ ప్రెస్ మేడ్చల్ నుంచి తన ప్రయాణం ప్రారంభం అయ్యేలా చూడాలి” అని రైలు ప్రయాణికుల సంఘం అభిప్రాయపడింది.

మంత్రాలయం- కర్నూలు కొత్త రైల్వే లైన్ కోసం డిమాండ్

మరోవైపు మంత్రాలయం నుంచి కర్నూలు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని రైల్వే ప్రయాణికుల సంఘాలు కోరుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ చాలా సంవత్సరాలుగా పెండింగ్‌ లో ఉంది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే, రైతులకు ఇతర నగరాలకు వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడానికి వీలు కల్పించడం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుదతుందని సంఘం నాయకులు కోరారు.

Read Also:  రైల్వే స్టేషన్ లో హ్యాపీగా వైఫై ఎంజాయ్ చెయ్యొచ్చు, సింపుల్ గా ఇలా చేస్తే చాలు!

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×