E-Paper
Advertisement

Rotten food in Trains: వందే భారత్ లో పాచిపోయిన చికెన్, కుళ్లిన గుడ్లు.. రైల్వే క్యాంటిన్ అరాచకం!

Rotten food in Trains: వందే భారత్ లో పాచిపోయిన చికెన్, కుళ్లిన గుడ్లు.. రైల్వే క్యాంటిన్ అరాచకం!
Advertisement

Indian Railways Food: భారతీయ రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్నిస్తోంది. అత్యాధునిక రైళ్ల నుంచి అదిరిపోయే స్పెసిలిటీస్ వరకు అందిస్తోంది. ఇక రైళ్లలో అందించే ఫుడ్ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రయాణీకులకు హైజినిక్ ఫుడ్ సరఫరా చేస్తున్నట్లు చెప్తోంది. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.  ఏమాత్రం క్వాలిటీ లేని ఆహార పదార్థాలను ఉపయోగించడంతో పాటు చెడిపోయిన వంటకాలను ప్రయాణీకులకు అందిస్తున్నారు. తాజాగా కొచ్చిలోని రైళ్లకు ఆహారం సరఫరా చేసే క్యాంటీన్ మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఎటు చూసినా అపరిశుభ్రత, పాచిపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. ఏమాత్రం నిబంధనలు పాటించని క్యాంటీన్ ను సీజ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

గత కొద్ది రోజులుగా కొచ్చి క్యాంటీన్ పై ఫిర్యాదులు

Advertisement

నిజానికి గత కొద్ది రోజులుగా కొచ్చి కార్పొరేషన్‌ పరిధిలోని ఎర్నాకుళం డివిజన్‌ లో ఉన్న క్యాంటీన్ పై ప్రయాణీకల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఫుడ్ ఏమాత్రం క్వాలిటీ ఉండటం లేదని కంప్లైంట్ వచ్చాయి. స్థానికులు కూడా ఈ క్యాంటీన్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఈ క్యాంటీన్ మీద అధికారులు ఫోకస్ పెట్టారు. తాజాగా దాడులు చేశారు. కార్పొరేషన్ జారీ చేసే లైసెన్స్ లేకుండా ఈ క్యాంటీన్ ను నడిపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

కుళ్లిపోయిన చికెన్.. చెడిపోయిన గుడ్లు

Advertisement

ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు జరిపిన తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ క్యాంటీన్ లో కనీస పరిశుభ్రత పాటించడం లేదు. ఎక్కడ చూసినా చెడిపోయిన ఆహారంతో దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు. ఈ క్యాంటీన్ నుంచి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లతో పాటు పలు రైళ్లకు ఫుడ్ సరఫరా జరుగుతున్నట్లు తెలిపారు. రైళ్లలో పంపిణీ చేయడానికి రెడీగా ఉంచిన ఆహార ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. “క్యాంటీన్ లో సుమారు 50 కిలోల కుళ్లిన చికెన్ దొరికింది. గత కొద్ది నెలలుగా ఈ చికెన్ ను నిల్వ చేస్తున్నట్లు గుర్తించాం. చెడిపోయిన ఎగ్స్, పప్పు కూడా ఉంది. ఇతర ఆహార పదార్థాలు కూడా క్వాలిటీగా లేవు. ప్రస్తుతం క్యాంటీన్‌ను సీజ్ చేశాం. క్యాంటీన్ కు కనీసం కార్పొరేషన్ అనుమతి పత్రం కూడా లేదు” ని పబ్లిక్ హెల్త్ అధికారులు వెల్లడించారు.

Read Also: 2 టికెట్స్ కన్ఫార్మ్, మరో 2 వెయిటింగ్ లిస్ట్, నలుగురూ జర్నీ చెయ్యొచ్చా?

గతంలోనే రూ. 10 వేల జరిమానా

ఇక కనీసం మురుగునీటి శుద్ధి చేయకుండా నేరుగా స్థానిక కాల్వలోకి పంపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆహార వ్యర్థాలను కూడా అందులో పడేస్తున్నట్లు గుర్తించారు.  గతంలోనూ ఈ క్యాంటీన్ కాలువలోకి వ్యర్థాలను పారవేసినందుకు రూ.10,000 జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్యాంటీన్ సీజ్ కు సంబంధించి రైల్వే నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read Also: విమానంలో షర్టులు విప్పి కూర్చున్న ప్రయాణీకులు.. ఏం చేస్తారు పాపం, పరిస్థితి అలాంటిది!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×