BigTV English
Advertisement

UP Man: ఒక రైలు ఎక్కబోయి.. మరో రైలు ఎక్కాడు.. చివరి ప్రాణాలు కోల్పోయాడు!

UP Man: ఒక రైలు ఎక్కబోయి.. మరో రైలు ఎక్కాడు.. చివరి ప్రాణాలు కోల్పోయాడు!

UP Train Accident:

ప్రయాణీకులు సేఫ్ గా జర్నీ చేసేందుకు రైల్వే అధికారులు ఎన్ని సూచనలు, సలహా ఇచ్చినప్పటికీ, వాటిని పాటించక ప్రాణాలు కోల్పోతున్నారు. రైల్వే స్టేషన్ సహా, రైల్వే పరిసరాల్లోనూ జాగ్రత్తగా ఉండాలని, వెళ్లాల్సిన రైలు ఏ ప్లాట్ ఫారమ్ మీదికి వస్తున్నాయో తెలుసుకుని ఎక్కాలని అధికారులు చెప్తూనే ఉంటారు. రైలు ఆగిన తర్వాతే ఎక్కడంతో పాటు దిగాలని సూచనలు చేస్తుంటారు. అయినప్పటికీ కొంత మంది అవేమీ పట్టించుకోకుండా ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పొరపాటుగా వేరే రైలు ఎక్కి ప్రాణాలు కోల్పోయాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..


యూపీ రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి    

యూపీలోని సాలెంపూర్ రైల్వే స్టేషన్‌ లో ఓ వ్యక్తి తప్పుగా ఎక్కి.. కదులుతున్న రైలు నుంచి దూకి చనిపోయిన ఘటన సంచలనం కలిగించింది. ఆ వ్యక్తిని లార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేవాలి గ్రామానికి చెందిన సంజయ్ ప్రసాద్ (42)గా పోలీసులు గుర్తించారు. అతడు ముంబైలోని ఒక ప్రైవేట్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. సుమారు నాలుగు నెలల సెలవుతో ఇంటికి వచ్చిన ఆయన, తిరిగి ముంబైకి వెళ్లాలనుకున్నాడు. గురువారం రాత్రి ముంబైకి బయల్దేరేందుకు అతడి  సోదరుడు అతడిని సాలెంపూర్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. అయితే, అతడు పొరపాటున ముంబైకి వెళ్లాల్సిన రైలుకు బదులుగా, బర్హాజ్ వెళ్లే రైలు ఎక్కాడు.

Read Also: వేగంగా వస్తున్న.. వందే భారత్ ముందుకు దూకిన కుక్క.. తర్వాత జరిగింది ఇదే!


కదులుతున్న రైల్లో నుంచి దూకి మృతి

కాసేపటి తర్వాత రైలు స్టార్ట్ అయ్యింది. ముందుకు కదిలింది. రైలు బర్హాజ్ సెక్షన్ వైపు కదలడం ప్రారంభించింది. అప్పుడే తాను పొరపాటుగా వేరే రైలు ఎక్కానని గుర్తించాడు. అప్పటికే రైలు స్పీడ్ అందుకుంది. అయినప్పటికీ రైల్లో నుంచి కిందికి దూకాడు. వేగంగా కిందపడటంతో సంజయ్ ప్రసాద్ అక్కిక్కడే చనిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న ప్రయాణీకులు వచ్చి చూసే సరికి తను చనిపోయి ఉన్నట్లు తెలిపారు. వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకున్నారు.  మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం కోసం హాస్పిటల్ కు తరలించినట్లు సాలెంపూర్ పోలీసులు తెలిపారు. ప్రయాణీకులు ఇప్పటికైనా రైల్వే అనౌన్స్ మెంట్స్ ను జాగ్రత్తగా విని, ఫాలో కావాలన్నారు. లేదంటే ప్రసాద్ లా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు.

Read Also: పట్టాలు తప్పిన రైలును మళ్లీ పట్టాలు ఎక్కించడం ఇంత కష్టమా? అస్సలు ఊహించి ఉండరు!

Related News

US Shutdown 2025: అమెరికాలో క‌ల‌క‌లం..నిలిచిపోయిన‌ విమాన సేవలు, ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు !

Kodak HD Ready LED TV: రూ. 16 వేల కొడాక్ టీవీ జస్ట్ రూ. 8 వేలకే, ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్!

Vande Bharat Train: వందేభారతా? చెత్త బండా? సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Food on Trains: ట్రైన్ జర్నీ చేస్తూ నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Araku Special Trains: అరకు లోయకు ప్రత్యేక రైళ్లు, టూరిస్టులకు రైల్వే గుడ్ న్యూస్!

Vande Bharat Sleeper: ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్, వందేభారత్ స్లీపర్ రైళ్లు ఇప్పట్లో రానట్టే!

Safest Seats: బస్సుల్లో సేఫెస్ట్ సీట్లు ఇవే.. ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడొచ్చు!

Kashmir Tour: కాశ్మీర్ టూర్ బుకింగ్ ఓపెన్.. హైదరాబాద్ నుంచి కేవలం రూ.36వేల లోపే ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్

Big Stories

×