E-Paper
Advertisement

Woman in Train: రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళ.. లేడీ కానిస్టేబుల్ ఎంట్రీతో ఫ్యూజులు ఔట్.. ఏమైంది?

Woman in Train: రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళ.. లేడీ కానిస్టేబుల్ ఎంట్రీతో ఫ్యూజులు ఔట్.. ఏమైంది?
Advertisement

ఓ మహిళ ఒంటరిగా రైలు ఎక్కింది. ఆమెతో మరెవ్వరు లేరు. అలాగే ఆ బోగీలో కూడా అంత పురుషులే ఉన్నారు. ఆమె మాత్రమే మహిళ. దీంతో ఆమెలో అనుకోకుండానే ఏదో భయం మొదలైంది. అంతా మంచోళ్లయితే పర్వాలేదు.. వీళ్లలో ఎవరైనా చెడ్డవాడు ఉంటే? నిద్రపోయినప్పుడు ఏమైనా చేస్తే? ఆమె బుర్ర నిండా అవే ఆలోచనలు. ఇంత భయంతో ఇక నిద్రేమి పడుతుంది. ఈ రాత్రి జాగారమే అనుకుంది. సరిగ్గా అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్ ఆ బోగీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘‘నీ పేరు పూర్వినా’’ అని అడిగింది. అంతే.. దెబ్బకు ఆ మహిళా ప్రయాణికులురాలి ఫ్యూజులు ఔట్.

ఎవరు ఆ మహిళ? ఆ కానిస్టేబుల్‌కు ఆమె పేరు ఎలా తెలుసు?

Advertisement

ఆ లేడి కానిస్టేబుల్ తన పేరు ఆడగగానే పూర్వి నోటి నుంచి మాట రాలేదు. సందేహంగానే.. ‘ఆ.. ఔను నా పేరే పూర్వి’ అని చెప్పింది. ఆ వెంటనే లేడి కానిస్టేబుల్.. నెంబర్ 38 మీ బెర్తే కదా? అని మరో ప్రశ్న అడిగింది. దీంతో పూర్వి ఔనని సమాధానం చెబుతూనే.. ఇంతకీ నేను మీకు ఎలా తెలుసు అని అడిగింది. దానికి ఆ లేడీ కానిస్టేబుల్ చెప్పిన సమాధానం విని మరోసారి ఆశ్చర్యపోయింది పూర్వి.

మహిళ భద్రత కోసమే..

Advertisement

పూర్వి అడిగిన ప్రశ్నకు లేడీ కానిస్టేబుల్ సమాధానం ఇస్తూ.. ‘‘ఈ బోగీలో మీరు ఒక్కరే మహిళ ప్రయాణికురాలని తెలిసింది. అందుకే మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందేమోనని చెక్ చెయ్యడానికి వచ్చాం’’ అని తెలిపింది. ఆ తర్వాత ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చి.. మీకు ఏదైనా సమస్య వచ్చినా.. సేఫ్‌గా లేనని అనిపించినా వెంటనే ఈ నెంబర్‌కు కాల్ చెయ్యండి వస్తామని చెప్పింది. దీంతో పూర్వి చాలా సర్‌ప్రైజ్ అయ్యింది. రైల్వే మహిళలకు ఈ స్థాయిలో భద్రత కల్పిస్తుందా అని మరోసారి ఆశ్చర్యపోయింది. జర్నీ తర్వాత ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో లేడి కానిస్టేబుల్ వచ్చి.. తాను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉన్నానో లేదో చెక్ చేసి మరీ వెళ్లారని పేర్కొంది.

మహిళల భద్రత కోసమే..

రైల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఈ చర్యలు చేపడుతోంది. టీటీల నుంచి సమాచారాన్ని సేకరించి మరీ బోగీల్లో ఒంటరిగా ఉండే మహిళలకు భద్రత కల్పిస్తోంది. ముఖ్యంగా ఓవర్ నైట్ జర్నీ రైళ్లలో ఆర్పీఎఫ్ ప్రత్యేకంగా లేడీ కానిస్టేబుళ్లను ఏర్పాటు చేసి.. మహిళా ప్రయాణికుల్లో అభద్రతా భావాన్ని తొలగించే ప్రయత్నం చేస్తోంది. పూర్వి చేసిన సోషల్ మీడియా పోస్టుపై మరికొందరు స్పందిస్తూ.. తమను కూడా కొంతమంది ఆర్పీఎఫ్ పోలీసులు కలిశారని, ఏదైనా సమస్య ఉంటే హెల్ప్ లైన్ నెంబరుకు ఫిర్యాదు చేయాలని చెప్పారని పేర్కొన్నారు. మరి మీకూ ఇలాంటి అనుభవం ఎదురైందా?

ఇది కూడా చదవండి: IRCTC సూపర్ ఆఫర్.. తిరుపతి నుండి షిర్డీ యాత్రకు గోల్డెన్ ఛాన్స్!

Related News

35 ఏళ్ల క్రితం ల్యాండ్ అయింది.. ఇప్పటికీ కదల్లేదు! ఈ విమానం వింత కథేంటో తెలుసా?

దక్షిణ అయోధ్యకు ఇక ఫాస్ట్ జర్నీ.. భద్రాచలానికి నేరుగా హైస్పీడ్ రైలు!

న్యూక్లియర్ రియాక్టర్ వేడితో హైడ్రోజన్ ఉత్పత్తి.. భారత టెక్నాలజీకి ప్రపంచం షాక్!

పాదరక్షలు లేకుండా 32 కి.మీ నడక.. సింహాచల గిరి ప్రదక్షిణ విశిష్టత ఇదే!

రోడ్లపై ఎండ.. భవనాలపై వర్షం.. చైనా కొత్త కూలింగ్ టెక్నిక్ కు ప్రపంచం ఫిదా!

రూ. లక్ష కోట్లతో ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రం.. మదనపల్లెకు మహర్దశ!

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

Big Stories

Advertisement
×