Jagadatri Deepthi : తెలుగు బుల్లితెరపై ఎంతోమంది సీరియల్ హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఒక్కో సీరియల్లో నటిస్తూ జనాలని ఆకట్టుకుంటున్నారు.. బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. అయితే ఈమధ్య సీరియల్స్లోకి తెలుగు హీరోయిన్ల కన్నా వేరే భాషల్లోని హీరోయిన్ ఎక్కువగా తీసుకుంటున్నారు.. ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ కి డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇటీవల కాలంలో ప్రారంభమైన సీరియల్స్లలో జగధాత్రి సీరియల్ ఒకటి ఈ సీరియల్లో హీరోయిన్ గా నటిస్తున్న అమ్మాయి దీప్తి మన్నే… ఈమె గురించి అందరికీ తెలిసి ఉంటుంది.. అయితే ఈమె ఏం చదువుకుంది? ఉద్యోగం ఏమైనా చేసిందా అన్నదాని గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది.. మరి దీప్తి ఎంతవరకు చదువుకుంది గతంలో ఏదైనా జాబ్ చేసిందా అన్నది మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
ప్రముఖ తెలుగు ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో జగదాత్రి సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న ముద్దుగుమ్మ దీప్తి ఇటీవల ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా ఆమె తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.. దీప్తి ఏం చదువుకుంది అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. నిజానికి కర్ణాటలోనే దావణగెరెలో జన్మించారు.. ఆమె ఉన్నత విద్య అంతా కూడా బెంగుళూరులోనే పూర్తి చేశారు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి బీఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేశారు. తన ఫ్రెండ్ తో కలిసి సరదాగా వెళ్లిన ఆడిషన్ కి ఆమె సెలెక్ట్ అవ్వడంతో అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేసింది. ప్రస్తుతం తెలుగు సీరియల్స్లలో కూడా బిజీగా నటిస్తూ ఉంది..
కన్నడ ముద్దుగుమ్మ దీప్తి మన్నె తెలుగులో కూడా వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. 2019లో రాధమ్మ కూతురు సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సీరియల్లో అక్షరాన్ని పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను తన నటనతో బాగా ఆకట్టుకునేలా చేసింది. ఒకవైపు కన్నడలో మరోవైపు తెలుగులో అవకాశాలు ఆమెకు వెతుక్కుంటూ వస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. జగద్ధాత్రిగా కొత్త అవతారమెత్తారు. ఇందులో ఆమె ఒక గృహిణిగా కనిపిస్తూనే రహస్యంగా ఒక అండర్ కవర్ ఇంటెలిజన్స్ ఆఫీసర్గా నటిస్తుంది. ఈమె ఈ సీరియల్ లో చేసిన ఫైటింగ్ లు సినిమాల్లో కూడా పెద్దగా చేసి ఉండాలని సోషల్ మీడియాలో ఆమధ్య వార్తలు కూడా బాగా వినిపించాయి.. ఇకపోతే సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటున్న ఈ కన్నడ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో చిట్ చాట్ కూడా చేస్తూ ఉంటారు.