Intinti Ramayanam Pallavi : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లలో ఎక్కువగా వినిపించే పేరు ఇంటింటి రామాయణం.. కుటుంబ కథ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్కు రోజు రోజుకి డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ఫ్యామిలీ రివెంజ్ డ్రామాగా జనాలను ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ విలన్ పాత్రలో నటించింది పల్లవి.. ఈమె గురించి ఇప్పటికే అనేకసార్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. తాజాగా మరోసారి ఈ పల్లవి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంటింటి రామాయణం విలన్ పల్లవి ఏం చదువుకుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. కన్నడ ముద్దుగుమ్మ అయిన ఈ అమ్మడు ఇంతకీ ఏం చదివింది అన్నది మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
తెలుగు బుల్లితెరపై కన్నడ హీరోయిన్ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది కన్నడ హీరోయిన్లు తెలుగులో నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నారు.. అలాగే ఇంటింటి రామాయణం సీరియల్లో పల్లవి పాత్రలో నటిస్తున్న అమ్మాయి పేరు యశస్విని గౌడ.. కన్నడ ఇండస్ట్రీ లో అనేక సీరియల్స్లలో నటించి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈమె బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు గూగుల్లో నెటిజన్లు తెగ వెతికిస్తున్నారు. అయితే ఈ కన్నడ ముద్దుగుమ్మ ఏం చదివింది అన్నది తెలుసుకునేందుకు కొందరు ఆసక్తి కనబరుస్తున్నారు.. నిజానికి ఈ అమ్మాయి డిగ్రీ పూర్తి చేసి ఫ్యాషన్ డిజైనింగ్ చేసినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. ఆ తర్వాత ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. వరుసగా సీరియల్స్ చేసుకుంటూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ పెంచుకుంది.
Also Read : శుక్రవారం ఓటీటీల్లో సినిమాల సందడి.. ఏకంగా 16 సినిమాలు స్ట్రీమింగ్..!
కన్నడ ఇండస్ట్రీలోని సీరియల్స్ లలో వరుసగా సీరియస్ చేసి తమ టాలెంట్ నిరూపించుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న హీరోయిన్లకు తెలుగులో ఎప్పుడు డిమాండ్ ఉండనే ఉంటుంది. ఇప్పటికే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సీరియల్స్ లలో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లే ఉన్నారు. ఇంటింటి రామాయణం సీరియల్ లో విలన్ పల్లవి పాత్రలో నటిస్తున్న కన్నడ అమ్మాయి యశస్విని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరింది. విలన్ గా నటించిన అందరినీ బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఈమె గురించి ఎటువంటి వార్తలు వచ్చినా కూడా ఇట్లే వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈమె స్టడీస్ గురించి వచ్చిన వార్త కూడా మరోసారి నెట్టింట వైరల్ అవుతుంది.. ప్రస్తుతం ఈ సీరియల్లో ఈమె క్యారెక్టర్ పై ఒకవైపు నెగిటివిటీ దక్కిన కూడా మరోవైపు మాత్రం మంచి క్రేజ్ అయితే వచ్చింది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఈ సీరియల్ తర్వాత పల్లవి అలియాస్ యశస్విని నెక్స్ట్ ఎలాంటి క్యారెక్టర్ లో నటించబోతుందో చూడాలి..