Folk Industry Controversy:తెలంగాణాలో ఫోక్ సాంగ్స్ కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మనందరికీ తెల్సిందే.సినిమా పాటలకి దీటుగా కోట్లల్లో వ్యూస్ కొల్లగొడుతూ ఎంతో మందిని ఉర్రూతలు ఊగిస్తున్నాయి.అయితే తాజాగా ఫోక్ డాన్సర్స్ అయిన ఈశ్వర్ సాయి ,మాధురి రాథోడ్ వేముల వాడలోని ఒక లాడ్జిలో కలిసి పట్టుబడటంతో ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా ఇంతేనా అన్న డిబేట్లు మొదలయ్యాయి.అయితే ఇదే క్రమంలో జరిగిన జాను లిరి (Janu Lyri) మరియు వరలక్ష్మి (Varalakshmi) మధ్య నడుస్తున్న రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో జాను లిరి (Janu Lyri) మాట్లాడుతూ ఫోక్ ఇండస్ట్రీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ పెద్ద రచ్చకు తెరతీశాయి. ఫోక్ ఇండస్ట్రీలోని కొంతమంది నిర్మాతలు, ఇతర కళాకారులపై ఆమె సెన్సేషన్ కామెంట్స్ చేసింది. ఫోక్ ఇండస్ట్రీలో ఎవరూ ఊరికే ఎదగలేదని, ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని పైకి వచ్చామని స్పష్టం చేసింది. మొదట్లో పది మంది కలిసి ఒకే ఇంట్లో ఉంటూ, ఆకలితో అలమటిస్తూ ఈ స్థాయికి వచ్చామని, ఇప్పుడు ఎవరో కొందరు ఇలా అడ్డంగా దొరికిపోతే ఇలా ఫోక్ ఇండస్ట్రీ మొత్తాన్ని కలిపి ఎందుకు అంటున్నారంటూ ఫైర్ అయింది.
గడిచిన పదేళ్లుగా ఈ ఇండస్ట్రీలో లేని చిల్లర పంచాయితీలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని సూటిగా ప్రశ్నించింది. ఫోక్ సాంగ్స్ వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డానని, పాటలే తమకు అన్నం పెడుతున్నాయని గుర్తుచేసుకుంది. “నా కష్టం నా పిల్లలకు, నా కుటుంబానికి నాలుగు పూటలా తిండి పెడుతోందని ఎవరో చేస్తే అందరిని ఒకే గాటున కట్టడం సరికాదని హెచ్చరించింది.
అయితే దీనికి కౌంటర్ గా వరలక్ష్మి (Varalakshmi) మాట్లాడుతూ పది సంవత్సరాలుగా లేని పంచాయితీలు ఇపుడు వస్తున్నాయని అంటున్నావ్..లాడ్జీలో దొరికిన వారిద్దరూ ఒక అండర్ స్టాండ్ తో కలిసారో లేదో మనకెవరికీ తెలీదని చెప్పుకొచ్చింది.అయినా ఇండస్ట్రీలో ఎవరి దగ్గరా పడుకోకుండా అవకాశాలు రావని ,ఆ సంగతి నీకు నాకు అందరికి తెలుసు అని ఫైర్ అయింది.
అయినా ఎవరికీ లేని దూల నీకెందుకు అని, పది సంవత్సరాలుగా ఉన్న నువ్వు ఎవరి దగ్గరా ఉండకుండా ఎవరికీ లొంగలేదని, ఎవరి దగ్గరా పడుకోలేదని చెప్పగలవా , అది కూడా నువ్వు అంటున్న నీ కొడుకు మీద ఒట్టు వేసి చెప్పగలవా అంటూ మండిపడింది.కాబట్టి పత్తిత్తు లాగా నువ్వే తోపు, నువ్వే గొప్ప అన్నట్టు బిల్డప్పులు ఇవ్వకుండా ఉంటె మంచిదని ,అసలు మధ్యలో రావడానికి నువ్వెవరు ,ముందు నువ్వు మధ్యలో నుండి దొబ్బెయ్ అంటూ ఘాటుగా కామెంట్స్ చేసింది వరలక్ష్మి (Varalakshmi).
మొత్తంగా ఈశ్వర్ సాయి ,మాధురి రాథోడ్ లు కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబటటం ఏమో కాని ఇపుడు ఫోక్ ఇండస్ట్రీ అంటేనే కమిట్ మెంట్ అనే ఒక మాయని మచ్చ లా పడిపోయింది. చూడాలి మరి ముందు ముందు ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో !