Mayor Elections: ప్రస్తుతం ఏపీలో మేయర్, చైర్పర్సన్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరుగుతున్నాయి. అంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లే వారిని ఎన్నుకుంటారు. ఈ విధానంలో రాజకీయ గందరగోళం, హార్స్ ట్రేడింగ్ సమస్యలకు అవకాశం ఉండటంతో.. స్థానిక సంస్థల్లో రాజకీయ అస్థిరతకు ఆస్కారం ఉందన్నది ప్రభుత్వ వాదన.
Also read: ఆ వ్యూహం ఇక్కడ పనిచేయదు.. స్థానిక ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
అందుకే ప్రత్యక్ష ఎన్నికలతో ప్రజల నుంచి నేరుగా మద్దతు పొందిన మేయర్, చైర్పర్సన్కు స్థిరత్వం వస్తుందని ప్రభుత్వం అనుకుంటోంది. 1986 నుంచి 2005 వరకు ఏపీలో ప్రత్యక్ష ఎన్నికల విధానం అమల్లో ఉండగా.. ఆ తర్వాత పరోక్ష ఎన్నిక విధానం వచ్చింది. ఇలా ప్రత్యక్ష ఎన్నికతో అభివృద్ధిలో వేగం పెరుగుతుందా? ప్రజల తీర్పుకు నిజమైన బలం ఇచ్చే ఈ సంస్కరణ గ్రౌండ్ లెవెల్ లో ఎంతవరకు ఫలిస్తుంది?