Addanki Ganja: అద్దంకి సమీపంలో ఇద్దరు ఎస్సైల వాహనం ప్రమాదానికి గురైన తర్వాత డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు బయటపడటం కలకలం రేపింది. పోలీసులు మాత్రం.. అనుమానితుడు వదిలిన బ్యాగ్ను స్వాధీనం చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పినా అది వర్కవుట్ కాలేదు. సో ఈ ఘటన ఆధారంగా వైఎస్ జగన్… కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. గంజాయిని అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే ఎలా వచ్చిందంటూ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. వైసీపీ హయాంలో SEB, ఆపరేషన్ పరివర్తన వంటి చర్యలు తీసుకున్నామన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే గంజాయి నిర్మూలనను ప్రధాన ప్రాధాన్యతగా ప్రకటించింది. సో ఇప్పుడు పొలిటికల్ టాక్స్ మాత్రం టాక్సిక్ గా మారుతున్నాయ్. అద్దంకి ఘటన కూటమి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసిందా అన్న చర్చ జరుగుతోంది.