Amaravati Development: అమరావతిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతి అభివృద్ధికి కనెక్టివిటీగా మారుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ సీడ్ యాక్సెస్ రోడ్డును చూసి అమరావతి పరుగులు పెడుతోందని మురిసిపోదామా.? కేవలం రహదారుల విస్తరణతోనే రాజధాని కల నెరవేరుతుందా? అని వివపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు ముగిసిపోయాయి. ఐనా తాత్కాలిక భవనాల్లో పరిపాలన సాగుతుంది. గత ఐదేళ్ల ఆలస్యం, రీ-టెండరింగ్ ప్రక్రియలు, నిధుల సర్దుబాటు వల్లే పనుల్లో నత్తనడకన సాగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. దీంతో శాశ్వత నిర్మాణాలు ఎప్పుడు రూపుదిద్దుకుంటాయనేది సస్పెన్స్గా మారింది.మిగిలిన ఈ మూడేళ్ల సమయం కూడా వేగంగా కరిగిపోతోంది. ప్రభుత్వం మాటలు దాటి.. శాశ్వత నిర్మాణాలకు పునాదిరాళ్లు పేర్చాలి. కంటిముందు రోడ్లు ఉన్నాయి సరే.. అమరావతి కలల రాజధానికి ఇటుక పడేదెప్పుడు? పొలాలను త్యాగం చేసిన వేలాది మంది రైతుల కళ్లల్లో ఆశల వెలుగు నిండేదెప్పుడు?