Jharkhand Student Protest: జంతర్ మంతర్ సీన్.. జార్ఖాండ్కు మారింది. ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తిత్తే, JPSC, JSSC పేపర్ లీకులపై రాంచీ ర్యాలీలతో అట్టుడుకుతోంది. అసెంబ్లీ ముట్టడి చేపట్టిన స్టూడెంట్స్పై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. యాజ్ ఇట్ ఈజ్గా ఢిల్లీ సీన్లే ర్యాలీలో రిపీటయ్యాయి. జార్ఞాండ్లో విద్యార్థుల ఆందోళనలకు కాక్రోచ్ జనతా పార్టీ సపోర్ట్ ఇచ్చింది. ఢిల్లీకి..రాంచీకి మధ్య వున్న ఓ బిగ్ ఛేంజ్ ఇప్పుడు బిగ్ డిబెట్గా మారింది. ఢిల్లీ నిరసనలను కాంగ్రెస్ ఔట్ రైట్ సపోర్ట్చేస్తే.. రాంచీలో ఆ రోల్ బీజేపీ తీసుకోవడం. జార్ఖండ్లో విపక్షంగా వున్న బీజేపీ.. విద్యార్థుల ఆందోళనలు అస్త్రంగా హేమంత్ సోరెన్ సర్కార్ పై విమర్శలు సంధిస్తున్నారు. ఇది కేవలం జార్ఖండ్ సమస్య కాదని, దేశవ్యాప్త సంక్షోభమమన్నారు సీఎం హేమంత్ సోరెన్. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు. పేపర్ లీక్కు సంబంధించి పోలీసులు పలువుర్ని అరెస్ట్ చేశారు. విద్యార్ధుల డిమాండ్లపై తాము సానుకూలంగా స్పందించామంటోంది హేమంత్ సోరెన్ సర్కార్. కానీ స్టూడెంట్స్ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజీపీతో పాటు బీజేపీ మద్దతు ఇవ్వడం విశేషం.