Ongole Political Row: ఒంగోలులో కూటమి నేతలిద్దరూ ఉప్పు నిప్పుగా మారిపోయారు. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఒంగోలు గిత్తల్లా పోటిపడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనానర్దన్పై జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి అవినీతి ఆరోపణలు చేశారు. ఇసుక, మద్యం, గ్రావెల్ మాఫియాల్లో ఎమ్మెల్యేలకు మామూళ్లు ముడుతున్నాయని విమర్శించారు. మున్సిపాలిటీలో 8 కోట్లు మిస్ అయ్యాయంటూ బాంబు పేల్చారు. కాణిపాకం వెళ్లి ప్రమాణం చేద్దాం రమ్మంటే.. తానూ రెడీ అంటూ అమీతుమీకి సిద్ధమయ్యారు బాలినేని.
పోటీ చేయడానికి నేను సిద్ధం.. బాలినేని
జనసేన లేకుంటే ఒంగోలులో గెలిచేవాడివా అని బాలినేని వేసిన ప్రశ్న.. ఇప్పుడు కూటమి ఐఖ్యతకు మానని గాయాన్ని చేసింది. ఒంగోలులో స్వతంత్రంగా పోటీ చేయడానికి తాను సిద్ధమని.. దామచర్ల రెడీనా అంటూ బాలినేని ఛాలెంజ్ చేశారు. ఈ ఆరోపణలకు కౌంటరిచ్చిన దామచర్ల.. బాలినేని, వైసీపీ కోసం పనిచేస్తున్నారని ఫైరయ్యారు. ఇలా, కూటమిలో నేతల మధ్య మాటలయుద్ధం.. ఇంకెంత దూరం వెళ్తుంది? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని సర్దుబాటు చేస్తారా?