Rangareddy: రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రాంతంలో ఓ ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. బీహార్కి చెందిన నవనీత్, స్థానిక పరిశ్రమలో లారీ డ్రైవర్గా పని చేసేవాడు. అనంతరం నవనీత్ తిరిగి ఇంటికి వచ్చేసరికి.. తన చిన్న కుమార్తె అనామిక , ధనుంజయ అనే యువకుడి మృతదేహాలను గమనించాడు. యువకుడు ఉరి వేసుకుని ఉండగా, యువతి మృతదేహం కింద పడి ఉంది. నవనీత్ ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ స్థానిక బిస్కెట్ పరిశ్రమలోకార్మకులుగా పనిచేస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.