Python Video: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్, ఢిల్లీలో ఓ కొండచిలువ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంఘటనలో ఓ భారీ కొండచిలువ ఒక బాతును మొత్తం మింగి, చెరువు ఒడ్డున సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యం కనిపించింది. ఈ వీడియోను సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. ఈ వీడియోకు వేలాది లైక్లు, కామెంట్లు చేస్తున్నారు. లక్షల మంది నెటిజన్లు ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. ఈ ఘటన మానవ నివాస ప్రాంతాల్లో వన్యప్రాణుల అనుకూలతను అలాగే.. ఆశ్చర్యకరమైన పరిణామాలను స్పష్టంగా చూపిస్తుంది.
?utm_source=ig_web_copy_link
ఈ వీడియోలో పాము బాతును మింగిన తర్వాత చెరువు ఒడ్డున ఎండలో విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది. దాని శరీరం మధ్య భాగంలో ఏదో జీవం ఉన్నట్లు స్పష్టంగా తెలిసేలా ఉబ్బెత్తుగా ఉంది. అక్కడ ఈ దృశ్యం చూసినవారు ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియా పోస్ట్ చేయగా వెంటనే వైరల్ గా మారింది. కొందరు ఈ దృశ్యాన్ని హాస్యాస్పదంగా భావించగా, మరికొందరు వన్యప్రాణుల ప్రవర్తన గురించి మాట్లాడుకుంటున్నారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ALSO READ: AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం
పఅయితే కొండచిలువ విశ్రాంతి సమయం ఎక్కువ కాలం కొనసాగలేదు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పామును సురక్షితంగా బంధించి, వేరే చోటికి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రక్రియలో పాము ఒత్తిడికి గురై, ఊహించని విధంగా మింగిన బాతును కక్కేసింది. ఈ దృశ్యం అక్కడున్న వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కొందరు నెటిజన్లు పామును సురక్షితంగా విడుదల చేయాలని కోరగా, మరికొందరు దాని భోజనానికి ఆటంకం కలిగించినందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశారు. ఆ బాతును శాంతిగా తిననివ్వండి అని కామెంట్ చేశాడు. మరొకరు పెద్ద పామును పట్టేందుకు బానే సాహసం చేశారని మరొకరు రాసుకొచ్చారు.
ALSO READ: Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200
ఈ సంఘటన మానవులు, వన్యప్రాణుల మధ్య పరస్పర చర్యలను హైలైట్ చేస్తుంది. నగర ప్రాంతాల్లో వన్యప్రాణులు తమ జీవనానికి అనుగుణంగా అనుకూలిస్తున్న విధానం ఆశ్చర్యకరమైనది. కొన్నిసార్లు ఆందోళన కలిగించేది. ఈ వీడియో వినోదాన్ని అందించడమే కాకుండా, పర్యావరణ సమతుల్యత, వన్యప్రాణుల రక్షణ గురించి ఆలోచించేలా చేసింది.