BigTV English
Advertisement

AP Tenth Results: పదో తరగతి ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600/600 సాధించింది.. రియల్లీ ఆమె గ్రేట్

AP Tenth Results: పదో తరగతి ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600/600 సాధించింది.. రియల్లీ ఆమె గ్రేట్

AP Tenth Results: ఏపీలో ఈ రోజు ఉదయం టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో మొత్తం 81.14 శాతం మంది పాసైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 1680 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి మే 28 వరకు జరగనున్నాయి.


ఫస్ట్ టైం 600 మార్కులు:

అయితే, ఈసారి ఏపీ పదో తరగతి ఫలితాల్లో కాకినాడ అమ్మాయి అరుదైన రికార్డు సాధించింది. 600కు 600 మార్కులు సాధించి యల్ల నేహాంజని రికార్డు సృష్టించింది. ఆమె కాకినాడలోని భాష్య పాఠశాలలో టెన్త్ క్లాస్ చదివింది. పదో తరగతి ఫలితాల్లో 600 మార్కులు సాధించడం ఇదే తొలిసారి అని అధికారులు చెబతున్నారు.


ఈసారి బాలికలదే పైచేయి..

అయితే ఈ సారి పదో తరగతి  ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 84.09 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురలో 78.31 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు ఎగ్జామ్స్ జరిగిన విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షలకు మొత్తం 6 లక్షల 14వేల 459 మంది విద్యార్థులు హాజరు అవ్వగా.. వారిలో 4లక్షల 98వేల 585 మంది పాసైనట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

మన్యం ఫస్ట్.. అల్లూరి లాస్ట్..

ఏపీ టెన్త్ ఫలితాల్లో 93.90 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో ఉండగా.. అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఫలితాలను ప్రభుత్వం వైబ్ సైట్ లో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఫలితాలను వెబ్‌సైట్  https://results.bse.ap.gov.in/RES25/ , http://bse.ap.gov.in  మాత్రమే కాకుండా మన మిత్ర వాట్సాప్ Send Hi 95523 00009, అలాగే LEAP Mobile App చూడొచ్చు.

Also Read: Viral Video : 434 / 440 మార్క్స్.. ఇంకా ఏడుస్తావేంది? తింగరి దానా..

Also Read: ITDC Recruitment: ఇండియా టూరిజం డెవలప్‌మెంట్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.. జీతం అక్షరాల రూ.71,000

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×