E-Paper
Advertisement

Pawan Kalyan Camp office: డ్రోన్ ఎగిరింది వాస్తవమే.. అసలు విషయాన్ని చెప్పిన పోలీసులు..

Pawan Kalyan Camp office: డ్రోన్ ఎగిరింది వాస్తవమే.. అసలు విషయాన్ని చెప్పిన పోలీసులు..
Advertisement

Pawan Kalyan Camp office: గత రెండు రోజులుగా జనసేన పార్టీ కార్యాలయంపై డ్రోన్ ఎగిరిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ డ్రోన్ ఘటన వెలుగులోకి రాగానే పవన్ కళ్యాణ్ భద్రతపై జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఎట్టకేలకు డ్రోన్ ఎగిరిన కేసును పోలీసులు ఛేదించారు.

మంగళగిరి లోని జనసేన ప్రధాన కార్యాలయం పై రెండు రోజుల క్రితం డ్రోన్ ఎగిరినట్లు స్థానిక నాయకులు గుర్తించారు. తమ పార్టీకి సంబంధించినది కాకపోవడంతో, అసలు ఆ డ్రోన్ ఎందుకు పార్టీ కార్యాలయం పైకి వచ్చిందన్న అనుమానాలను జనసేన అగ్ర నాయకులు వ్యక్తం చేశారు. అంతేకాకుండా మంగళగిరి పోలీసులకు జనసేన ఫిర్యాదు చేసింది. సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమల రావు కూడా ఇదే విషయంపై మాట్లాడారు. డ్రోన్ ఎగిరిందా లేదా అన్న కోణంలో కూడా విచారణ సాగుతుందని, త్వరలోనే అసలు విషయాన్ని ప్రకటిస్తామంటూ డీజీపీ చెప్పారు.

Advertisement

అలా డీజీపీ ప్రకటన ఇచ్చారో లేదో డ్రోన్ ఎగిరిన ఉదంతంపై సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జనసేన పార్టీ కార్యాలయం పై డ్రోన్ ఎగిరిన విషయం వాస్తవమేనని, అయితే ఆ డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్ సంస్థదిగా పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య, కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేసేందుకు మంగళగిరిని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. అందులో భాగంగానే డ్రోన్ మంగళగిరిలోని టీడీపీ, జనసేన పార్టీ కార్యాలయాలపై ఎగిరినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. గత రెండు రోజులుగా రహస్య డోన్ ఎగిరిందని ఆందోళన పడుతున్న జనసేన నాయకులు అసలు విషయం తెలిసి ఊరట చెందారు.

Also Read: TDP – YCP: అమిత్ షా వార్నింగ్? టెన్షన్‌లో ఉన్న ఆ ఇద్దరెవరు?

Advertisement

గత ఏడాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మంత్రి వంగలపూడి అనితలకు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెల్సిందే. పోలీసులు 12 గంటల వ్యవధిలోనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మళ్ళీ అనుమానస్పదంగా డ్రోన్ సంచరించడంతో జనసేన నాయకులు కాస్త కంగారు పడ్డారు. ఎట్టకేలకు డ్రోన్ వ్యవహారానికి పోలీసులు తెరదించారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×