BigTV English
Advertisement

Pawan Kalyan Camp office: డ్రోన్ ఎగిరింది వాస్తవమే.. అసలు విషయాన్ని చెప్పిన పోలీసులు..

Pawan Kalyan Camp office: డ్రోన్ ఎగిరింది వాస్తవమే.. అసలు విషయాన్ని చెప్పిన పోలీసులు..

Pawan Kalyan Camp office: గత రెండు రోజులుగా జనసేన పార్టీ కార్యాలయంపై డ్రోన్ ఎగిరిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ డ్రోన్ ఘటన వెలుగులోకి రాగానే పవన్ కళ్యాణ్ భద్రతపై జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఎట్టకేలకు డ్రోన్ ఎగిరిన కేసును పోలీసులు ఛేదించారు.


మంగళగిరి లోని జనసేన ప్రధాన కార్యాలయం పై రెండు రోజుల క్రితం డ్రోన్ ఎగిరినట్లు స్థానిక నాయకులు గుర్తించారు. తమ పార్టీకి సంబంధించినది కాకపోవడంతో, అసలు ఆ డ్రోన్ ఎందుకు పార్టీ కార్యాలయం పైకి వచ్చిందన్న అనుమానాలను జనసేన అగ్ర నాయకులు వ్యక్తం చేశారు. అంతేకాకుండా మంగళగిరి పోలీసులకు జనసేన ఫిర్యాదు చేసింది. సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమల రావు కూడా ఇదే విషయంపై మాట్లాడారు. డ్రోన్ ఎగిరిందా లేదా అన్న కోణంలో కూడా విచారణ సాగుతుందని, త్వరలోనే అసలు విషయాన్ని ప్రకటిస్తామంటూ డీజీపీ చెప్పారు.

అలా డీజీపీ ప్రకటన ఇచ్చారో లేదో డ్రోన్ ఎగిరిన ఉదంతంపై సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జనసేన పార్టీ కార్యాలయం పై డ్రోన్ ఎగిరిన విషయం వాస్తవమేనని, అయితే ఆ డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్ సంస్థదిగా పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య, కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేసేందుకు మంగళగిరిని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. అందులో భాగంగానే డ్రోన్ మంగళగిరిలోని టీడీపీ, జనసేన పార్టీ కార్యాలయాలపై ఎగిరినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. గత రెండు రోజులుగా రహస్య డోన్ ఎగిరిందని ఆందోళన పడుతున్న జనసేన నాయకులు అసలు విషయం తెలిసి ఊరట చెందారు.


Also Read: TDP – YCP: అమిత్ షా వార్నింగ్? టెన్షన్‌లో ఉన్న ఆ ఇద్దరెవరు?

గత ఏడాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మంత్రి వంగలపూడి అనితలకు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెల్సిందే. పోలీసులు 12 గంటల వ్యవధిలోనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మళ్ళీ అనుమానస్పదంగా డ్రోన్ సంచరించడంతో జనసేన నాయకులు కాస్త కంగారు పడ్డారు. ఎట్టకేలకు డ్రోన్ వ్యవహారానికి పోలీసులు తెరదించారు.

Related News

CM Chandrababu: నిద్రలో కూడా ప్రజల గురించే ఆలోచిస్తా.. ఇదే నా విజన్: సీఎం చంద్రబాబు

Srikakulam News: కాశీబుగ్గ టెంపుల్ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంది.. ఘటనపై మంత్రి ఆనం స్పందన ఇదే..

Stampede At Kasibugga: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా

Kasibugga Templ: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఎలా జరిగిందంటే..

Kasibugga Temple Stampade: కాశీబుగ్గ గుడిలో తొక్కిసలాట.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

Srikakulam: తీవ్ర విషాదం.. కాశీబుగ్గలో తొక్కిసలాట.. 12 మంది మృతి..

Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి.. ఐరాసలో అరుదైన గౌరవం

AP Politics: గీత దాటితే సస్పెండ్.. తిరువూరు పంచాయితీపై చంద్రబాబు సీరియస్

Big Stories

×