E-Paper
Advertisement

AP Men Suicide In Varanasi: వారణాసిలో అన్నదమ్ముల ఆత్మహత్యకు కారణాలివేనా..!

AP Men Suicide In Varanasi: వారణాసిలో అన్నదమ్ముల ఆత్మహత్యకు కారణాలివేనా..!
Advertisement

AP Men Suicide In Varanasi| ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి నగరంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో నివసించే లక్ష్మి నారాయణ(34), వినోద్ (32) గా పోలీసులు గుర్తించారు. ఏప్రిల్ నెలలో వీరిద్దరూ ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. దీంతో వారి కుటుంబసభ్యులు కొన్ని నెలలుగా వారి కోసం వెతుకుతున్నారు.

బంధువులు, స్నేహితులు అందరి ఇళ్లలో వారిద్దరి కోసం వెతికినా లాభం లేక పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు లక్ష్మి నారాయణ, వినోద్ మిస్సింగ్ కేసుని నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోలీసులు కథనం ప్రకారం.. ఇద్దరు అన్నదమ్ములు ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. అయితే ఇద్దరూ వ్యాపారపరంగా తీవ్ర నష్టాలు కలగడంతో అప్పుల పాలయ్యారు. దీంతో వారిపై అప్పులు తిరిగి చెల్లించాలని తీవ్ర ఒత్తిడి ఉండేది. ఈ కారణంగా ఇల్లు వదిలి పారిపోయారని పోలీసులు తెలిపారు.

Advertisement

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

అలా ఆంధ్ర ప్రదేశ్ నుంచి పారిపోయి వారణాసిలోని ఒక ఆశ్రమంలో ఒక గది అద్దెకు తీసుకొని గత కొన్ని నెలలుగా అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 09, సోమవారం రాత్రి ఆశ్రమంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు పాల్పడే ముందు ఇద్దరూ.. తమకు కొందరు చంపేస్తామని బెదిరిస్తన్నారంటూ వీడియోలు తీసి బంధువులకు పంపారు. ఆ తరువాత ఆశ్రమంలో వారిదరి మృతదేహాలు చూసి పోలీసులకు ఆశ్రమం వారు సమాచారం అందించారు. వారణాసి పోలీసులు వారి గుర్తింపు కార్డులను పరిశీలించి ఆంధ్రా పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారంతా వారణాసి బయలు దేరి వెళ్లారు.

Advertisement

Also Read: ‘రూ.5 వేలకే అందమైన యువతి’.. ఒక మహిళ ఎలా మోసపోయిందంటే..

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×