BigTV English
Advertisement

AP Pension Scheme: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై వారికి కూడా పింఛన్ నగదు..

AP Pension Scheme: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై వారికి కూడా పింఛన్ నగదు..

AP Pension Scheme: ఏపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఒకేసారి పింఛన్ పెంచి నగదు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందని చెప్పవచ్చు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల సమావేశంలో తన నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. త్వరలోనే కొత్త కార్యాచరణకు సంబంధించి ప్రక్రియ పూర్తి చేయాలని కూడా సీఎం ఆదేశించారు.


రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సామాజిక పింఛన్లను కూటమి ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ పెంచడంతో పాటు, మూడు నెలలకు వెయ్యి చొప్పున కూడా అదనంగా కలిపి వృధ్యాప్య పింఛన్ ను పంపిణీ చేశారు. అలాగే దివ్యాంగులకు కూడా పింఛన్ ను రూ. 6000 అందజేశారు. అయితే వాలంటీర్లు లేరు కాబట్టి పింఛన్ పంపిణీ ఎలా అనుకుంటున్న సమయంలో సచివాలయ సిబ్బంది చేత, నగదు పంపిణీ చేసి ప్రభుత్వం మన్ననలు పొందింది.

ఇలా సామాజిక పింఛన్ల విషయంలో పక్కాగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో తల్లీదండ్రులు లేని చిన్నారులకు పింఛన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఒంటరి చిన్నారులకు ప్రభుత్వం అండగా ఉండాలన్న ఉద్దేశంతో, సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది ఒంటరి చిన్నారులు ఉన్నట్లు అధికారిక లెక్క ఉండగా, మరో 3 నెలల్లో పక్కా సమాచారంను ప్రభుత్వానికి అందజేయాలని సీఎం ఆదేశించారు.


Also Read: Indian Railways Rule: రైలులో చైన్ లాగితే.. పొగ త్రాగినా ఫైన్ తెలుసు.. కానీ పొరపాటున కూడా ఈ పని మాత్రం చేయొద్దు..

ఈ నిర్ణయంతో తల్లీదండ్రులు లేని చిన్నారులకు ఆర్థిక సాయం అందుతుందని చెప్పవచ్చు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మానవాతావాదులు, స్వచ్చంద సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరూ లేక దిక్కు తోచని స్థితిలో గల చిన్నారులకు ప్రభుత్వం సాయం అందించే ప్రక్రియకు పూనుకోవడం హర్షించదగ్గ విషయమని నెటిజన్స్ కూడా ప్రభుత్వానికి తమ మద్దతు పలుకుతున్నారు. మరి మీ దృష్టిలో కూడా ఇలాంటి చిన్నారులు ఉంటే, వారికి కూడా ప్రభుత్వం చేపట్టబోయే కొత్త నిర్ణయాన్ని తెలిపి, భరోసా కల్పించండి. ఈ సంధర్భంగా సీఎం చంద్రబాబుకు నెటిజన్స్.. థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related News

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

Big Stories

×