BigTV English

Visakha Wonders: విశాఖలో అద్భుతం.. ఇప్పుడే చూసేయండి.. మళ్లీ ఆ ఛాన్స్ రాదు!

Visakha Wonders: విశాఖలో అద్భుతం.. ఇప్పుడే చూసేయండి.. మళ్లీ ఆ ఛాన్స్ రాదు!

Visakha Wonders: విశాఖ ప్రజలకు ఇప్పుడే అవకాశం. మళ్లీ మళ్లీ ఇలాంటి అవకాశం రాదు. ఔను.. కేవలం కొద్ది కాలమే ఈ ఛాన్స్. అందుకే ఇప్పుడే ఈ విషయం తెలుసుకోండి. త్వరగా మీరు వెళ్ళి సందర్శించండి. గొప్ప అనుభూతి పొందండి. ఇంతకు ఏంటా ఛాన్స్.. మళ్లీ రాని ఆ ఛాన్స్ ఏమిటో ఇప్పుడే తెలుసుకుందాం.


విశాఖపట్నం బీచ్.. కాసేపు తీరప్రాంతం వాతావరణాన్ని ఆస్వాదించేందుకు నగరవాసులకు ఒక వరం. అంతేకాదు ఎక్కడెక్కడో నగరానికి వచ్చిన వారు తప్పక బీచ్ ను సందర్శించాల్సిందే. ఇక్కడ బీచ్ ఒక్కటే కాదు, ఇక్కడి చుట్టూ ప్రక్కన ప్రదేశాలు కూడా సందర్శించదగినవే. అయితే ఇటీవల ఈ బీచ్ కు కొత్త అందం వచ్చింది. అంటే నగరవాసులకు భక్తిమయ ప్రపంచాన్ని పరిచయం చేసే ఆధ్యాత్మిక భావన గల అధ్యాయం ఇప్పుడు వైజాగ్ బీచ్ కు వచ్చింది. ఇక పూర్తి వివరాలలోకి వెళితే..

విశాఖపట్నం ఆర్కే బీచ్ పరిసరాల్లో ఇప్పుడు ఓ కొత్త ఆకర్షణ కేంద్రం దర్శనమిస్తోంది. అది మరేమీ కాదు.. అయోధ్య రామ మందిరం నమూనా! పుట్టపర్తి గరుడ గ్రూప్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్మించబడిన ఈ నమూనా ఆలయం, భక్తులకు మాత్రమే కాక పర్యాటకులకు, శిల్ప కళాభిమానులకు విశేషంగా ఆకర్షణీయంగా మారింది.


నిర్మాణం వెనుక కృషి
ఈ నమూనా ఆలయాన్ని తయారుచేయడానికి సుమారు 45 రోజులు సమయం పట్టింది. ఇందులో 15 మంది ఆర్కిటెక్ట్లు, 325 మంది శిల్పులు, కార్మికులు తమ శ్రమను సమర్పించారు. అయోధ్య రామ మందిరానికి ప్రతిరూపంగా నిర్మించిన ఈ నమూనాలో ప్రతి చిన్న వివరాన్ని నిష్ణాత శిల్పకళతో తీర్చిదిద్దారు. 91 అడుగుల ఎత్తుతో ఉండే ఈ ఆలయం, బయట నుంచి చూసిన వారికే కాకుండా లోపలికి వెళ్ళినవారికి నిజమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.

ఆలయ విశేషాలు
ఈ నమూనాలో రాములవారి గర్భగుడితోపాటు హనుమంతుడి, బాలరాముడి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాత్రి సమయంలో ప్రత్యేక లైటింగ్‌తో మెరిసిపోయే ఈ నమూనా ఆలయం, సముద్రపు అలల మధ్య ఒక అద్భుతమైన దృశ్యాన్నిస్తుంది.

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఈ ఆలయ ప్రవేశ రుసుము రూ. 50 మాత్రమే కాగా, సందర్శన సమయం ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కేటాయించారు. మూడునెలల పాటు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ పామ్ బీచ్ హోటల్ పక్కన ఈ అయోధ్య రామమందిరం నమూనా నగరవాసులకు అందుబాటులో ఉండనుంది. ఈ నమూనా ఆలయాన్ని సందర్శించేందుకు కుటుంబసమేతంగా భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. సెల్ఫీలు తీసుకోవడానికి, దైవ దర్శనం కోసం ఈ ప్రదేశం ఇప్పుడు హాట్ స్పాట్‌గా మారింది.

Also Read: Visakha City: విశాఖకు ఫుల్ జోష్.. సూపర్ ప్రాజెక్ట్ వస్తోంది.. నగరంలో ఇక సందడే సందడి!

ఎందుకు చూడాలి?
ఈ ఆలయ నమూనా వల్ల భక్తులు అయోధ్య వెళ్లకుండానే అక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని అనుభవించవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలతో పాటు వెళ్లే కుటుంబాలకు ఇది ఒక అరుదైన అవకాశంగా మారుతోంది. అంతేకాదు, భారతీయ శిల్పకళా సంపదను చక్కగా ఆవిష్కరించే ఈ నిర్మాణం విద్యార్థులకు, కళాకారులకు కూడా ప్రేరణ కలిగిస్తోంది.

భవిష్యత్తు ప్రణాళికలు
గరుడ గ్రూప్ ప్రతినిధుల ప్రకారం, భవిష్యత్తులో ఇతర ప్రముఖ దేవాలయాల నమూనాలను కూడా వీరు ప్రతిష్టించాలన్న యోచనలో ఉన్నారు. ఇది రామ మందిర నమూనా మాత్రమే కాకుండా, దేశంలోని ఆధ్యాత్మిక పర్యాటనకు కొత్త దారులు చూపించే ఆవిష్కరణగా చెబుతున్నారు.

స్థానికుల స్పందన
విశాఖపట్నం ప్రజలు ఈ నమూనా ఆలయాన్ని తమ నగరానికి గర్వకారణంగా భావిస్తున్నారు. మా పిల్లలు అయోధ్య అనే పేరే వినలేదు, కానీ ఇప్పుడు ఈ నమూనా ఆలయాన్ని చూశాక వాళ్లకీ ఆ దేవతల పట్ల అవగాహన వస్తోందని స్థానికులు చెబుతున్న మాటలు ఆలయ ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి. విశాఖ బీచ్ లో ఈ అయోధ్య రామ మందిరం నమూనా ఒక పవిత్రతకు ప్రతీక మాత్రమే కాదు, భారతీయ కళా సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. సముద్రపు తీరం వెంబడి భక్తి పరవశం కలిగించే ఈ ఆలయం తప్పకుండా చూడదగిన ప్రదేశంగా మారింది. ఈ వేసవిలో మీరు విశాఖ వస్తే, ఆర్కే బీచ్ వద్ద ఈ నమూనా ఆలయాన్ని తప్పక సందర్శించండి.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×